వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సమైక్యం అని సీమాంద్ర ప్రజలు, తెలంగాణ నాయకులు, తెలంగాణ నాయకులు అనుకున్నారు. సమైక్యశంఖారం అని సీమాంద్రలో గోల చేసిన వైఎస్ జగన్ .. ఢిల్లీ వెళ్లి పార్లమెంటుల్లో సైలెంట్ గా తన పని తాను చూసుకున్నాడనే విమర్శలు సీమాంద్ర ప్రజల నుండి వినిపిస్తున్నాయి.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సైలెంట్ సభ పెట్టి, జాతీయ మీడియాకు ఫోటో పోజులు ఇవ్వటం జరిగిందని సమైక్యవాదులు అంటున్నారు.
అసలు జగన్ కోరుకున్నదే జరిగిందని ఆ పార్టీ నాయకులే మీడియా ముందు నోరు జారుతున్నారు. వైఎస్ జగన్ ఏం కోరుకున్నాడు? సమైక్యంద్ర కోరుకున్నాడు. అంటే సీమాంద్ర ప్రజలకు దగ్గరయ్యాడు. తెలంగాణ ప్రజలకు దూరమయ్యాడు.
ఇక్కడే రాజకీయ సూక్ష్మం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ జగన్ మనసులో రాష్ట్ర విభజన జరగాలని మనసులో కోరుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్ర విభజన చేసిందని.. రాజకీయ విమర్శకులు అంటున్నారు.
జగన్ రాజకీయ ఎదుగుదలను ..కాంగ్రెస్ పార్టీయే కాపాడుతుందనే దానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర విభజన చేయటంతో .. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో క్రెడిట్ కొట్టేసింది. జగన్ సమైక్యం అన్నందుకు సీమాంద్రల్లో సానుభూతి కొట్టేశారు. గత ఉపఎన్నికల్లో సీమాంద్ర ప్రాంతం నుంచి 17 మంది ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ పార్టీ సొంతం చేసుకుంది. తెలంగాణ లో ఒక్క ఎమ్మెల్యేను కూడా దక్కించుకోలేదు.
తమ పార్టీలో ఉన్న తెలంగాణ నేతలను కూడా బయటకు నెట్టేసింది. తెలంగాణ వచ్చిన రాకపోయిన.. ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుంచి ఆశించిన ఫలితం రాదని ముందే జగన్ పసిగట్టి, సమైక్యాంద్రకు జై అన్నారు.
ఇప్పడు సీమాంద్ర రాజకీయ పరిస్థితుల్లో.. వైఎస్ జగన్ పార్టీ వర్సెస్, తెలుగుదేశం పార్టీ పోటా పోటీగా కనబడతుంది. ఈ రెండు పార్టీలే రాబోయే ఎన్నికల్లో ఏదో ఒకటి విజయం సాధిస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగానే జగన్ ఇన్ని రోజులు సమైక్య అన్నారు. సమైక్య ముసుగులో సీమాంద్ర ప్రజలు మోసం చేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ సీమాంద్రలో వైఎస్ జగన్ గెలిచిన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రావటం ఖాయం అనే విషయం తెలిసిపోతుంది, కేంద్రంలో ఏ పార్టీ ఉన్న తప్పక వైఎస్ జగన్ మద్దతు ఇవ్వక తప్పదు కాబట్టి, ‘‘కిందపడ్డ పై చెయ్యి మాదే ’’ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ రాజకీయ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇలాంటి పొద్దుతిరుగుడు సమైక్యవాదుల కోసమే కాంగ్రెస్ హైకామండ్ ముందుగా..గాలం వేసినట్లు ప్రతిపక్ష నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. తల్లి కాంగ్రెస్, పిల్లి కాంగ్రెస్ పార్టీలు కలిసి.. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేదే వారి ద్వేయం. అందుకే రాజకీయ కుట్రలు పన్నుతూ.. తెలుగు ప్రజలు మోసం చేస్తున్నారని రాజకీయ మేథావులు అంటున్నారు.
అయితే వైఎస్ జగన్ ఢిల్లీ సమైక్య రాగం వినిపించి అలసిపోయి ఈరోజు హైదరాబాదు రావటం జరిగింది. వైఎస్ జగన్ , బిజేపి నేత నాగం జనార్థన్ రెడ్డి ఒకే ఒకే విమానంలో కలిసి రావటం జరిగింది. బిజేపి నేత కోసం ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్ , నాగం ఇద్దరు ఒకే బయటకు రావటంతో జగన్ కు తీవ్ర అవమానం జరిగింది.
నాగం అభిమానులు , వైఎస్ జగన్ ను చూసి, ఒక్కసారిగా జై తెలంగాణ అంటూనే వైఎస్ జగన్ గో బ్యాక్ అనే నినాదాలు చేయటం జరిగింది. వైఎస్ జగన్ వెంటనే హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని బిజేపి కార్యకర్తలు గోల చేయటంతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉద్రిక్తత్త చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, వైఎస్ జగన్ రక్షణ నిలిచి వెంటనే బిజేపి కార్యకర్తల్లో అక్కడనుంచి పంపించారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more