నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఆమ్ ఆద్మీ అవలంబించిన రాజకీయ విధానాలను పొగుడుతూనే ఆమ్ ఆద్మీ అనేదానికి అర్థం ఇంకా విస్తృతమైన పరిధిలో ఉంటే బాగుంటుందని, దాని గురించి ఆలోచన చెయ్యమని అరవింద్ కేజ్రీవాల్ ని కోరారు.
మిగతా రాజకీయ పార్టీలలా కాకుండా కుల మత ప్రాంతీయ విభేదాలకు తావివ్వకుండా రాజకీయ వ్యూహరచన చేసి ఢిల్లీ గద్దెను సంపాదించిన ఆఆపా కి ప్రణామం అని అన్న అమర్త్య సేన్, సమాన హక్కుల గురించి పోరాడే విధానంలో ఆ పదానికి అర్థం కాస్త వికృతీకరించబడిందని అభిప్రాయాన్ని కూడా తెలియజేసారు. ఆమ్ ఆద్మీ అంటే ఎవరు, దాని అర్థం మారుతూ పోతుందా అని అడిగారాయన.
ఒకవేళ నిరుపేదల తరఫునే పోరాడుతున్నట్లయితే కరెంట్ బిల్లులో వసూలు చేసే ఛార్జీల గురించి మాట్లాడకండి ఎందుకంటే నిరుపేదలకు అసలు కరెంట్ కనెక్షనే లేదు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న యోగంద్ర యాదవ్ లాంటి వాళ్ళు తనకు తెలుసని, వాళ్ళు తప్పక ఆలోచిస్తారని తనకు నమ్మకముందని అన్న అమర్త్య సేన్ సామాజిక సమ న్యాయం, పేదల తరఫున పోరాటం చెయ్యటానికి కంకణం కట్టుకున్న ఆఆపా వాటిని సరిగ్గా నిర్ధారించుకోవాలని, కేవలం ఢిల్లీలో సాధించిన విధానంలోనే పోతే సరిపోదని అన్నారు.
ఇంకా ఆఆపా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి, వాళ్ళని వాళ్ళు స్వయం పరిశీలన ద్వారా తెలుసుకుంటారని, పార్టీ సిద్ధాంతాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ వారి లక్ష్యసాధనలో ఆ పార్టీకి విజయం చేకూరాలని తన ఆకాంక్షను కూడా అమర్త్య సేన్ తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more