రాష్ట్ర విభజన పై రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ విమర్శలతో ఇరు ప్రాంతాల నాయకులు విడిపోయి పేప్పర్ స్ప్రే కొట్టుకున్న విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాల నాయకులు ఎలా గోల చేసిన..కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రాష్ట్ర విభజన పై.. లోక్ , రాజ్యసభ ఆమోదం వేయటం జరిగింది.
ఇక రాష్ట్రపతి ఆమోదం పొందితే..దేశలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుంది. ఇలాంటి రచ్చ మన రాష్ట్రంలో జరుగుతున్నప్పటికి సమైక్యంద్ర టాలీవుడ్ నుండి ఎలాంటి కామెంట్ గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు.
రాష్ట్ర విభజన వద్దని గానీ, రాష్ట్ర విభజన కావాలని గానీ. టాలీవుడ్ నుండి ఏ ఒక్కరు బయటపడి చెప్పలేదు. టాలీవుడ్ పెద్దల మనుసుల్లో వారికి ఇష్టమైనది జరిగితే బాగుంటుందని అనుకున్నారే తప్ప.. ఏ రోజు బయటపడి టాలీవుడ్ పెద్దలు చెప్పలేదు.
కారణం .. తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడితే.. సీమాంధ్రాలో సినిమాలు ఆగిపోతాయేమో? సమైక్యాంద్ర కు జై అంటే తెలంగాణ లో తము నటించిన సినిమాలకు దెబ్బతగులుతుందేమోనని ..సినీ పెద్దలు, సినీజనాలు ఏం చెప్పకుండా. సైలెంట్ గా ఉండిపోయారు.
అయితే రాష్ట్ర విభజన పక్రియ జరిగిపోయిన తరువాత కూడా సినీ పెద్దలు మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. టాలీవుడ్ మగధీరుడు(దర్శకుడు) రాజమౌళి (జక్కన్న) రాష్ట్ర విభజన పై తన మనసులోని మాటను దైర్యంగా బయటపెట్టి నిజమైన దర్శకుడు అనిపించుకున్నారు.
టాలీవుడ్ పెద్దలు ఎవరు రాష్ట్ర విభజన పై బయటపడకపోయిన.. మన జక్కన్న మాత్రం రాష్ట్ర విభజనను సంతోషంగా స్వాగతించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ విభజన నేపధ్యంలో ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీగా టాలీవుడ్ మారుతుందని రాజమౌళి అభిప్రాయం.
టాలీవుడ్ కింద రెండు రాష్ట్రాలు వచ్చాయి కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతలకు కొద్దిపాటి బిజినెస్ ఎక్కువుగా జరిగే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.
అయితే రాజమౌళి ఇలాంటి ప్రకటన చేసినందుకు టాలీవుడ్ లోని కొంతమంది పెద్దలు మండిపడుతున్నారు. అసలే రాజమౌళి ఒక భారీ ప్రాజెక్ట్ బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేస్తే.. సినిమాకు దెబ్బ తగులుతుందని టాలీవుడ్ లోని సీనియర్స్ అంటున్నారు.
కానీ జక్కన్న ప్లాన్ వేరుగా ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే బాహు బలి సినిమా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉందని అంటున్నారు. అనుష్క పుట్టిన రోజు, ప్రబాష్ పుట్టిన రోజు , ప్రేమికుల రోజు చాలా తెలివిగా జక్కన్న బాహుబలి ని వాడుకున్న విషయం తెలిసిందే.
ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన బాహుబలి సినిమా చూడకుండా అభిమానులు, తెలుగు ప్రజలు ఉండలేరని .. రాజమౌళి సన్నిహితులు అంటున్నారు.
అయితే జక్కన్న అసలు రహస్యం ఏమిటయ్యా అంటే .. బాహుబలి సినిమా రిలీజ్ నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పాడతాయి. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రజలు బాహుబలి సినిమా చూసే అవకాశం కలుగుతుందని, అంతేకాదు రాష్ట్ర విభజన జరిగిన తరువాత విడుదల అయ్యే మొట్ట మొదటి అత్యంత భారీ చిత్రం బాహుబలి అని, ఈ సినిమా కూడా మగధీర సినిమా మాదిరి ఇది కూడా రికార్డుకేక్కుతుందని జక్కన్న అభిప్రాయం.
అలాగే బాహుబలి బిజినెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీగానే జరగబోతుంది, కాబట్టి మారుతున్న పరిణామలు రాజమౌళికి ఆనందం కలిగించాయిన..ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏమైన జక్కన్న తెలివికి అందరు ఆశ్చర్యపోవాల్సిందేనని ఆయన అభిమాను అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more