రాష్ట్రం రాజకీయ రంగులు పూర్తిగా మారిపోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయటం, గవర్నర్ ఆమోదించటంతో ..రాజకీయాల్లో హీట్ పెరిగిపోయింది.
సమైక్య రాష్ట్రంలో మళ్లీ రాష్ట్రపతి పరిపాలన వస్తుందని .. రాజకీయ నాయకులు గోల చేస్తున్న సందర్భంలో .. మరో సరికొత్త రాజకీయ ప్రకటన తెరపైకి వచ్చింది. నిన్నటి వరకు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇరుప్రాంతాల సీనియర్ నాయకుల తెర వెనుకపోటీ పడ్డారు. రాష్ట్ర పతి పాలన వద్దని .. హైకమాండ్ కు కొంతమంది కాంగ్రెస్ నాయకులు విన్నవించుకున్నారు.
ఆంద్రప్రదేశ్ రాజకీయలతో ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్ హైకమాండ్ మరో పెను సంచలనమైన నిర్ణయం తీసుకుందని ఢిల్లీలో నాయకులు అంటున్నారు. రాష్ట్రపతి పాలన కంటే.. ఇరు ప్రాంతాల నుండి ఉత్తమైన నాయకులను తీసుకొని, రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్లు రాజకీయ నాయకులు అంటున్నారు.
అందులో భాగంగానే కాంగ్రెస్ హైకమాండ్ ఇరుప్రాంతాల నుండి ఇద్దరు ముఖ్య నాయకులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమండ్ రెండు ప్రాంతాలను రెండు వర్గాలను టార్గెట్ చేసుకోని .. ఈ ఇద్దరి పేర్లను సూచించినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. సీమాంద్రలో సామాజిక వర్గం , తెలంగాణ లో రెడ్డి వర్గం పై కాంగ్రెస్ హైకమాండ్ ద్రుష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అందులోబాగానే.. సీమాంద్ర కన్నా లక్ష్మీ నారాయణను, తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సోనియా గాంధీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.
సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ.
సీమాంద్రలో సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ ను సీమాంద్ర ముఖ్యమంత్రి గా ప్రతిపాదిస్తూ.. సీమాంద్ర లోని సామాజిక ఓటు బ్యాంకు పై కాంగ్రెస్ ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది.
సీమాంద్రకు .. కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అయితే.. సీమాంద్ర నాయకుల్లో ఎలాంటి విభేదాల రావనే అనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలోని సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషణ. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కన్నాను ముఖ్యమంత్రి చేయటమే మంచిదని.. సీమాంద్ర నేతలు కూడా మనస్పూర్తిగా భావిస్తున్నారు.
ఇక తెలంగాణ ఇచ్చాం కాబట్టి, తెలంగాణ లో మనకు ఎదురులేదని అనుకుండా సోనియా గాంధీ , అతి సూక్ష్మమైన నిర్ణయం తీసుకుంది. కేసిఆర్ పార్టీ విలీనం పై ఆయన అడుగులు వెనబడుతున్నట్లు పసిగట్టిన ..సోనియాగాంధీ అందుకు తగిన రాజకీయం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతం నుండి ఉత్తమా కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రాంతం నుండి అనేక మంది ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగులు చేశారు . కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి, ఉత్తమా కుమార్ రెడ్డి పేరును సోనియ గాంధీ సూచించినట్లు సమాచారం.
ఇలాంటి సమయంలో తెలంగాణ లో ఒకే సారి బిజేపి , టిఆర్ఎస్ పార్టీలను ద్రుష్టిలో పెట్టుకొని .. కాంగ్రెస్ పార్టీలో సినియార్ నాయకుడు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ని తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించేందుకు సోనియా గాంధీ అంగీకరించినట్లు ఢిల్లీలోని మా తెలుగువిశేష్ సభ్యులకు ఢిల్లీ రాజకీయ నాయకులు సమాచారం అందించారు .
తెలంగాణ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా అయితే.. తెలంగాణ లోని రెడ్డి వర్గం. మన అధీనంలో ఉంటుందనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు ముఖ్యమంత్రలు, రెండు రాష్ట్రాలు చేసి, ఎన్నికలను ఆరు నెలలపాటు వెనక్కి వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నహాలు చేస్తుందని మా తెలుగువిశేష్ సభ్యులకు అందిన సమాచారం .
ఇప్పటి వరకు ఈ ఇద్దరి పై రాజకీయ విమర్శలు కానీ, ఎలాంటి రాజకీయ మరకలు గానీ లేవు. అదీ గాక.. వీరిపై ఇరు ప్రాంతాల ప్రజల్లో, నాయకుల్లో.. మంచి అభిప్రాయమే ఉన్నట్లు రాజకీయ సర్వేలు చెబుతున్నారు. అంతే కాకుండా రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, సోనియా గాందీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీమాంద్ర లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోకుండా ఉండాలంటే ఈ నిర్ణయమే మంచిదని సీమాంద్ర కాంగ్రెస్ రాజకీయ పెద్దలు అంటున్నారు. ఇక తెలంగాణలో ఉన్న రెడ్డి వర్గాన్నీ దగ్గరకు తీయటంతో.. తెలంగాణ రాష్ట్రాంలో కాంగ్రెస్ పార్టీ కి బలం పెరుగతుందని సోనియా గాంధీ భావించినట్లు సమాచారం.
ఈరోజు ఢిల్లీలో సోనియాతో ఈ ఇద్దరు..
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ ముగ్గురు మద్య గంటసేపు సుదీర్ఘమైన చర్చలపై చర్చించారు. రాష్ట్ర పరిస్థితులపై సోనియా గాందీ ఎప్పటికప్పుడు తెలుసుకోని నిర్ణయం తీసుకుంటుంది. అందుకు ఈరోజు ఈ ఇద్దరితో జరిగిన సమావేశమే ఇందుకు నిదర్శనం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more