సమైక్యాంద్ర కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తిగా వార్తల్లో ఎక్కిన ఎపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మరో సారి సమ్మె బాట పట్టారు. అయితే అశోక్ బాబు చేపట్టిన సమ్మె ఎవరి కోసం చేస్తున్నారో, ఎందుకోసం చేస్తున్నారో, ఎవరికి అర్థం కావటంలేదని .. రాజకీయ మేథావులు అంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచటం కోసం ఆయన పోరాటం చేస్తున్నారనే విషయం తెలుసు. అయితే గత కొన్ని రోజుల నుండి అశోక్ బాబు ఎందుకు మౌనం వహించారో ఎవరికి అర్థం కావటం లేదు. పేపర్ పులి మాదిరి రోజుకోక ప్రకటన చేస్తూ.. కాలం వెల్లబుచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే .. యుద్దం చేస్తాం, బీభత్సం స్రుష్టిస్తాం అన్న అశోక్ బాబు.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై చర్చ జరుగుతున్న సమయంలో ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు అర్థం కావటంలేదని .. రాజకీయ మేథావులు అంటున్నారు.
అసెంబ్లీ నుండి తెలంగాణ బిల్లు.. పార్లమెంట్ కు చేరుకున్న తరువాత గానీ అశోక్ బాబు నిద్రలేవలేదా? . అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మౌన దీక్ష చేసి, జై సమైక్యాంద్ర అంటే గానీ అశోక్ బాబు మళ్లీ సమ్మెబాట పట్టాలేదు. అంటే అశోక్ బాబుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిక్కు సూచిగా ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. అయితే.. అశోక్ బాబు ఏమీ ఆశించించి ఈ ఏపీఎన్జీవోల సమ్మె చేస్తున్నాడు తెలియదు గానీ, దీనివలన సీమాంద్ర ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారనే విషయం బాగా అర్థమవుతుంది. గతంలో 100 రోజులు ఉద్యమం చేసి అశోక్ బాబు సాధించింది ఏమీ లేదు గానీ, ఆయన ఇమేజ్ మాత్రం బాగా పెంచుకున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన రాత్రి పూటే కలలు కనాలి. అలా కాదని పగలు కలలు కంటానంటే.. అది మీ ఇష్టం అంటారు. పగటి కలలు నేరవేరవనే విషయం అశోక్ బాబు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ బిల్లు .. అసెంబ్లీ (హైదరబాద్) కి వచ్చినప్పుడు .. ఒక సమైక్యవాదిగా.. మీరు, మీరు సైన్యం ఏమీ చేయలేకపోయేరనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.
అలాంటి.. ఇప్పుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీ (హైదరాబాద్ )దాటి పార్లమెంట్ (ఢిల్లీ)కి వెళ్లిపోయిన తరువాత.. మీరు .. ఎంత సమైక్య సునామీ పుట్టించిన ఫలితం శూన్యమే అని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ బిల్లు చివరి దశలో ఉన్న విషయం మీకు తెలుసు.. ప్రజలకు తెలుసు.. సీమాంద్ర నాయకులకు తెలుసు.. ఇలాంటి సమయంలో ఇప్పుడు సమ్మె అవసరమా? అశోక్ బాబు ఆలోచించుకోవాలని .. సమైక్య రాష్ట్రం కోరుకునే అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు నిజం చెప్పలంటే.. సీమాంద్ర నాయకులు గెలిచి.. ఓడిపోయారనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి .. ఒకే ఒక్క కేసిఆర్.
ఇక సమైక్య రాష్ట్రం కోరుకునేవారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, అశోక్ బాబు. ఇంతమంది నాయకులు ఉండి కూడా.. సమైక్యాంద్ర ఉద్యమాన్ని నడిపించటంలో ఘోరంగా విఫలం అయ్యేరనే విషయం తెలుగు గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ స్వార్థం రాజకీయాలకు .. సీమాంద్ర నాయకులు ఆజ్యాం పోయటంతో.. ఈరోజు మనకు ఇలాంటి ఖర్మ పట్టిందని .. సీమాంద్ర ప్రజలు బాధపడుతున్నారు. ఇక మన చెయి దాటిపోయిన తరువాత ..ఎన్ని ఉద్యమాలు, సమ్మెలు, దీక్షలు, చేసిన ఫలితం ఉండదనే విషయం తెలుసుకోవాలని .. రాజకీయ మేథావులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more