ఏ ధర్నా జరిగినా, ఏ ఆందోళన జరిగినా అక్కడ ప్రత్యక్ష్యమయ్యేది పోలీసులు. ఆందోళనకారులను అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్ లకు తరలిస్తారు. అయితే టైం బ్యాడ్ అయితే మాత్రం పోలీసులకూ చుక్కలు కనబడతాయి. పోలీసులు చేస్తున్న పనులను ఎవరైనా అడ్డుకుంటే ఎలా ఉంటుంది..? పోలీసుల పనికి అడ్డుతలగలమే కాకుండా వారిని నిలదీస్తే ఎలా ఉంటుంది.? అవును అచ్చంగా ఇలానే జరిగింది. హైదరాబాద్ లో అది కూడా చార్మినార్ వద్ద చోటుచేసుకున్న ఘటన ఇది. గత కొన్నిరోజులగా సాగుతున్న మునిసిపల్ ఉద్యోగుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతలా చర్చిస్తున్నా కానీ చర్చలు సఫలం కావడం లేదు.
Also Read: కామాంద ఖాకీకి కటకటాలు.. సిసిటీవీకి చిక్కిన అత్యాచారంపర్వం..
తాజాగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు చార్మినార్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి తట్టుకోలేకపోయారు. అందుకూ మునిసిపాలిటీ వారు ఎలాగూ చెయ్యడం లేదు కదా అని ఓ చెయ్యవేసి చెత్తను తీసివేద్దామని ముందుకు వచ్చారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ బాబురావుతోపాటు ఏసీపీలు అశోక్చక్రవర్తి ఆధ్వర్యంలో పోలీసులు, స్థానికులు తొలగించడానికి పూనుకున్నారు. అంతకు ముందు. డీసీపీ వి.సత్యనారాయణ తొలుత పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి చెత్తను శుభ్రం చేయాలని కోరారు. అయితే, కార్మికులు నిరాకరించి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో 30 మంది కార్మికులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు స్వయంగా చెత్తను తీసే పనిలో పడ్డా వారిని అడ్డుకుని.. చెత్తను తీసివెయ్యడానికి వీలులేదంటూ నినదించారు.
Also Read: బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు..? మహానాడులో బాలకృష్ణకు పరాభావమా?
అయినా ప్రతీసారి ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అని వార్త చూసీచూసీ జనాలకు కూడా విసుగు పుట్టింది కావచ్చు. తాజాగా చార్మినార్ దగ్గర పోలీసులు చెత్తను తీసివేస్తుంటే మున్సిపల్ కార్మికులు అడ్డుకోవడం కొంచెం కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. అయితే తమ సమస్యలను తీర్చాలని మునిసిపల్ ఉద్యోగులు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సానుకూల నిర్నయాలు తీసుకోవడం లేదు. అయితే ఇప్పటికే ప్రైవేట్ కార్మికులు ఎవరైనా వచ్చి చెత్తను తీసివెయ్యడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏకంగా కొట్టి తరిమేశారు మునిసిపల్ సిబ్బంది. తాజాగా పోలీసులకు కూడా వీరి కాక తగలడం విశేషం.
తండ్రీ కొడుకుల నిర్వాకం వల్లే తెలంగాణలోని మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. పురపాలక శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకుని, పంచాయతీరాజ్ శాఖను కేటీఆర్కు ఇచ్చారని, తండ్రీకొడుకులు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
By Abhinavachary
Also Read: నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more