ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద గతేడాది అక్టోబర్లో అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెల్లడించగా.. అతని మానసిక పరిస్థితి దృష్ట్యా జైలు శిక్ష విధించకుండా మెంటల్ హెల్త్ యూనిట్కు తరలించాలని ఆదేశించింది.
52 ఏళ్ల స్లేటర్ను గతేడాది అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. తన మాజీ భార్యను వేధిస్తున్నాడని అతనిపై కేసు పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆమెను భయపెట్టేలా మెసేజ్లు, కాల్స్ చేశాడంటూ మరో అభియోగం అతనిపై మోపారు. దీనిపై బుధవారం అక్కడి వేవెర్లీ లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ తీర్పు వెల్లడించారు. స్లేటర్కు జైలు శిక్ష విధించకుండా మూడు వారాల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉంచాలని ఆదేశించారు.
గత ఫిబ్రవరి నెల నుంచి స్లేటర్కు తన మానిసక స్థితి గురించి తెలిసి మందులు వాడాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా జడ్జి హడ్సన్ చెప్పారు. థెరపీ, కౌన్సిలింగ్కు అతడు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంగళవారం స్లేటర్ను నిర్బంధించిన పోలీసులు.. అతన్ని చికిత్స కోసం సిడ్నీ హాస్పిటల్లోని మానసిక విభాగానికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం స్లేటర్ కోర్టుకు రాలేకపోయాడు. స్లేటర్ ఇప్పటికే ఎన్నో మానిసక ఆరోగ్య కేంద్రాల్లో 100 రోజులు గడపటంతోపాటు ఐదుగురు సైకియాట్రిస్టులను కలిశాడు.
ఆస్ట్రేలియా తరఫున 1993-2001 మధ్య 74 టెస్టులు, 42 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత కామెంటేటర్గా మారాడు. అయితే గతేడాది ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్పై సోషల్ మీడియాలో తీవ్రంగా ధ్వజమెత్తడంతో సెవెన్ నెట్వర్క్ అతన్ని కామెంటేటర్ బాధ్యతల నుంచి తొలగించింది. గతేడాది కొవిడ్ కారణంగా ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కూడా ఆస్ట్రేలియన్లను అనుమతించకపోవడంతో.. ప్రధాని మోరిసన్ చేతులకు రక్తం అంటుకుంది అంటూ స్లేటర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more