ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి వరకు పటిష్టంగా వున్న ప్రత్యర్థి జట్టు.. చివరి ఓవర్లో సాధ్యమైనంత అధిక పరుగులు సాధించి స్కోరుబోర్డుపై పెట్టాలన్న అలోచనలకు ఆ బౌలర్ తూట్లు పోడిచాడు. తన చేతిలోని మాయాజాలాన్నంతా మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లోని చివరి ఓవర్ లోనే ప్రదర్శించాడు. అంతకుముందు ఓ ఓవర్ వేసినా.. సదరు బౌలర్ కు జట్టు కెప్టెన్ చివరి ఓవర్ కు ఎంచుకున్నందుకు తన నమ్మకాన్ని నిలిపాడు. ఇంతకీ ఆ మ్యాచులో ఏమైందంటే.?
నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్షిప్లో భాగంగా పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ, మలేషియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచు జరుగుతోంది. మలేషియా XI బౌలర్ విరన్దీప్ సింగ్ ఈ టీ20 మ్యాచులో అప్పటికే ఓ ఓవర్ వేశాడు. అయితే ఏకంగా 9 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి ఓవర్ ను టార్గెట్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ జట్టు భావించింది. అయితే మలేషియా ఎలెవన్ కెప్టెన్ మాత్రం స్పిన్నర్ విరన్ దీప్ సింగ్ పై పూర్తి నమ్మకం ఉంచాడు.
అంతే కెప్టెన్ నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ముకానివ్వని స్పిన్నర్ ఆఖరి ఓవర్లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. తొలి బంతిని వైడ్గా వేసిన విరన్ దీప్.. ఆ తర్వాత వరుసగా ఆరు వికెట్లు కూల్చాడు. ఇందులో హ్యాట్రిక్ సహా, ఓ రనౌట్ కూడా ఉండటం విశేషం. తొలి బంతికి క్రీజ్ లో కూరుకుపోయిన మృగ్యాంక్ పాఠక్ ను వెనక్కు పంపిన విరన్.. తరువాత బంతికి ఇషాన్ పాండేను రనౌట్ తో పెలివియన్ కు పంపాడు. ఇక ఆ తరువాత అనిండో నహారేయ్, విశేష్ సరోహా, జతిన్ సింఘాల్, స్పర్శ్ లను వరుసగా పెవిలియన్ కు పంపాడు.
ఇక ఈ క్రమంలో అనిండో నహారేయ్, విశేష్ సరోహా, జతిన్ సింఘాల్ వరుసగా పెవిలియన్ కు పంపడంతో విరన్ దీప్ సింగ్ తన తొలి హ్యాట్రిక్ ను కూడా సాధించాడు. 19వ ఓవర్ వరకు 131/3 స్కోరుతో పటిష్ఠ స్థితిలో కనిపించిన పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ జట్టు.. విరన్ దీప్ ధాటికి కేవలం ఒక్క పరుగును మాత్రమే స్కోరుబోర్డుకు జోడించిన ఢిల్లీ జట్టు.. 132/9 స్కోరుకు ఆటను ముగించింది. రనౌట్ అయిన ఇషాన్ పాండే తొలి పరుగును పూర్తి చేసి.. రెండో పరుగు కోసం వస్తూ రనౌట్ అయిన క్రమంలో తీసిన ఒక్క పరుగు స్కోరుబోర్డుకు జతకలిసింది.
అయితే ఇలాంటి ఘటన ఇంతకు ముందు కూడా జరగింది. దాదాపుగా 71 ఏళ్ల క్రితం, 1951 థామస్ హంటర్ కప్లో జరిగింది. రోలాండ్ యునైటెడ్.. రాయల్ వార్విక్షైర్ రెజిమెంటల్ అసోసియేషన్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో రోలాండ్ యూనైటెడ్ కు చెందిన సిహెచ్ సిర్రెట్ అనే బౌలర్ చెలరేగి ఆడాడు. సిర్రెట్ తన ఓవర్ లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించాడు. దీంతో అప్పటి మ్యాచ్ కేవలం ఐదు ఓవర్లలోనే ముగిసిపోయింది. అయితే ఆరు వికెట్లు తీసినా.. ఎక్స్ ట్రాల రూపేనా మూడు పరుగులిచ్చాడు సిర్రెట్. విరన్దీప్ సృష్టించిన ఈ చరిత్రను మీరూ చూసేయండి.!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more