ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటములను మూటగట్టుకుంటోంది. పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఒత్తిడి కారణంగా ఓటమి పాలైందని అబిమానులతో పాటు క్రిడాభిమానులు భావించారు. కానీ.. విరాట్ సేను తెగించి ఆటడం లేదన్న విషయం న్యూజీలాండ్ జట్టుతోనూ ఓటమిని చవిచూడటంతో స్పష్టమైంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ సహా ఫీల్డిండ్ విభాగంలోనూ రాణించలేక భారత క్రికెట్ జట్టు పూర్తిగా చతికిల పడింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, ప్రపంచ రేటింగ్ కలిగిన బౌలర్లు ఉండి కూడా టీమిండియా ఆకట్టుకునే స్థాయిలో ప్రదర్శనను ఇవ్వలేకపోతోంది.
న్యూజిలాండ్ తో ఘోర పరాభవం అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో తమను పిరికితనం ఆవహించిందని తెలిపాడు. ధైర్యంగా షాట్లు కొట్టేందుకు, తెగించి బౌలింగ్ వేసేందుకు తాము వెనుకంజ వేశామని అన్నాడు. మొత్తమ్మీద ఈ మ్యాచ్ లో ఏమంత ఆత్మవిశ్వాసంతో ఆడలేదని వెల్లడించాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ ఇంత బేలగా మాట్లాడతాడని అనుకోలేదని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ స్థాయి ఆటగాడికి ఇది తగదని అన్నారు.
మ్యాచ్ లు గెలిచేందుకు కోహ్లీ ఎంత కసితో ఉంటాడో అందరికీ తెలిసిందేనని, కానీ ఈ జట్టును, కోహ్లీ ఆలోచనా విధానాన్ని చూస్తుంటే ఏమాత్రం స్థాయికి తగ్గట్టుగా లేని విషయం వెల్లడవుతోందని కపిల్ దేవ్ విమర్శించారు. డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల దృక్పథాన్ని ఒక్కసారిగా మార్చడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నడుమ జట్టులో స్ఫూర్తి రగిలించేందుకు హెడ్ కోచ్ రవిశాస్త్రి, మెంటార్ ధోనీ తమ అనుభవాన్ని ఉపయోగించాలని కపిల్ సలహా ఇచ్చారు. వరుస ఓటముల పాలవుతున్న జట్టుపై విమర్శలు రావడం సహజమేనని, ఆటగాళ్లు అందుకు సంసిద్ధులుగా ఉండాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Jul 29 | భారత్తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ను 3-0తో కోల్పోయిన వెస్టిండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ టీ20 సిరీస్ ముందు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. వన్డేలలో తమను ఓడించినా టీ20లలో తమది బలమైన జట్టు... Read more
Jul 28 | బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 41 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయితే ప్రోటిస్ పరాజయం పాలైన ప్పటికీ ఆ జట్టు యువ ఆల్ రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం... Read more
Jul 28 | భారత క్రికెటర్లు ప్రపంచ ఛాంపియన్స్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇక మహిళల జట్టు కూడా అదే స్థాయి ఆటగాళ్లన్న విషయాన్ని లో ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్... Read more
Jul 28 | వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అతిధ్యజట్టు వెస్టిండీస్ పై వారి సొంతగడ్డపైనే ఓడించి.. మూడు వన్డేలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడవ వన్డేలో హైదరాబాదుకు చెందిన టీమిండియా... Read more
Jul 18 | ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు... Read more