బంగ్లాదేశ్ పై క్లీన్ స్వీప్ సాధించాక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్న మాటలపై లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 2000 నుంచి క్రికెట్లో భారత్ ఆధిపత్యం కనబర్చడం ప్రారంభమైందని, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని మ్యాచ్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సౌరవ్ గంగూలీ అప్పట్లో టీమ్ను నడిపించిన సంగతి విదితమే. ప్రస్తుతం భారత బౌలింగ్ భీకరంగా తయారైందని, ప్రత్యర్థి ఎవరైనా ఇండియా బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు.
గత మూడు, నాలుగేళ్లుగా పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం వస్తోందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచ్ ముగిశాక జరిగిన ఓ టీవీ షోలో దీనిపై గావస్కర్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత టీమిండియా సాధిస్తున్న విజయాలపై చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ‘అయితే, గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పటి నుంచే టీమిండియా ఆధిపత్యం కనబరుస్తుందని కోహ్లీ అన్నాడు.
గంగూలీని పొగిడే క్రమంలో కోహ్లీ అలా మాట్లాడి ఉండవచ్చు. అయితే 70, 80వ దశకాల్లోనే ఇండియా విదేశాల్లో అనేక విజయాలు సాధించింది. అప్పటికింకా కోహ్లీ పుట్టలేదు‘ అని చురకలు అంటించాడు. నిజానికి కొంతమంది 2000వ సంవత్సరం తర్వాతే క్రికెట్ ప్రారంభమయ్యిందని భావిస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడాడు. 70వ దశకంలోనే విదేశాల్లో భారత్ గెలుపొందిందని అన్నాడు. 1986లో విదేశీగడ్డపై సిరీస్ సాధించామని, అనేక సిరీస్లను డ్రాగా ముగించామని గావస్కర్ గుర్తు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more