ఐపీఎల్ 12 సీజన్ ముగిసింది. ఒక్క పరుగుతో చేతికందిన టైటిల్ చేజార్చుకుని రన్నర్ అప్ గా చెన్నై నిలిచింది. ఆఖరు బంతితో ఆటగాడిని కట్టడి చేయడమే కాక అతని వికెట్ తీయడంతో మలింగా హీరోగా నిలువగా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా నిలిచింది. హైదారబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తమకు విజయం వరిస్తుందని, అందుకు తమకు కలిసోచ్చే వేదిక కూడా దోహదం చేస్తుందని భావించిన చెన్నై ఒక్క పరుగుతో ఒటమిని చవిచూడటంతో చెన్నై జట్టు భావోద్వేగానికి లోనైంది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చెన్నై ఓటమితో ధోని అంతటి మిస్టర్ కూల్ కూడా నిరాశకు లోనయ్యారు. ఇక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పరిణితి చెందిన అభిమానులు నిట్టూర్పును వదిలేయగా, కొందరు మాత్రం ఒక్క పరుగు ఎంత ప్రాధాన్యత వుందో తెలియజేసిందంటూ మరికోందరు వ్యాఖ్యలు చేస్తూ సర్థిచెప్పుకున్నారు. అయితే పెద్దలు విషయం పక్కన బెడితే ఈ చిన్నారి అభిమాని మాత్రం చెన్నై ఓటమితో తీవ్రంగా కలత చేందాడు.
చివరి ఓవర్ వచ్చేసరికి దేవుడ్ని ప్రార్థిస్తూ మ్యాచ్ ను తిలకిస్తున్న తెలంగాణ శేరిలింగంపల్లికి చెందిన ఈ బాలుడు.. లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్ లో తమ అభిమాన జట్టు గెలవాలని కాంక్షిస్తూ వున్నాడు. మొదటి మూడు బంతుల్లో చెన్నై నాలుగు పరుగులు చేసింది. డబుల్ సాధించే క్రమంలో షేన్ వాట్సన్ రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో దేవుడా చెన్నైని గెలిపించూ అంటూ అర్థించాడు.
ఇక సూపర్ ఓవర్ ఫలితాన్ని తేలుస్తుందని భావించిన క్రమంలో మలింగా వేసిన అఖరు బంతికి శార్ధూల్ ఠాకూర్ అనూహ్యంగా ఔటయ్యాడు. దీంతో ఈ బాల అభిమాని తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఎగురుకుంటూ ఏడ్చేశాడు. అప్పటి వరకు కుర్చీలో కూర్చున్న బాలుడు అమాంతం పైకి లేచి ఎగురుకుంటూ గంతులేస్తూ ఏడుస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు తన తల్లిని బిగ్గరగా పిలుస్తూ.. అయ్యో.. అయ్యో ఇలా జరిగిందే అంటూ తన భాధను వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more