ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ పట్టుబిగించింది. పెర్త్ టెస్టులో అసీస్ బ్యాట్స్ మెన్లు చెలరేగిపోతూ తమ స్కోరును అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న క్రమంలో టీమిండియా బౌటర్ షమీ వారిపై విరుచుకుపడ్డాడు. ఇవాళ జరుగుతున్న రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న కంగారు బ్యాట్స్ మెన్లు.. భోజన విరామానికి ముందు టీమిండియా బౌటర్లను అడుకున్నారు.
కాగా రెండో సెషన్ వచ్చేసరికి టెస్టులో పట్టు సాధించేందుకు సిద్దమైన అసీస్ బ్యాట్స్ మెన్ల నడ్డివిరిచాడు మహమ్మద్ షమీ. నాలుగోరోజు కొనసాగుతున్న ఆటలో ఓవర్ నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్ ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును రెండో సెషన్ ఆరంభంలోనే వరసగా మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టాడు షమీ. జట్టు స్కోరు 192 వద్ద ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ (37) వెనుదిరిగాడు.
గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ తీసుకున్న అరోన్ ఫించ్ (25) ఇవాళ మళ్లీ బ్యాటింగ్కి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైపోయాడు. ఈ దశలో దూకుడు పెంచేందుకు ప్రయత్నించిన ఉస్మాన్ ఖవాజా (72) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ ముగ్గురినీ మహ్మద్ షమీ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించడం విశేషం. ప్రస్తుతం ఆస్ట్రేలియా 198/7తో కొనసాగుతుండగా.. తొలి ఇన్నింగ్స్లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే 241 ఆధిక్యంలో ఆ జట్టు ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more