టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టీ20 కెరీర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టెస్టు నుంచి తప్పుకున్న ఆయన ఇక క్రమంగా పరిమిత ఓవర్ల నుంచి కూడా తప్పించేందుకు బిసిసిఐ పూనుకుంటుందా.? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. పరిమిత ఓవర్లలో ఆయన అంతగా రాణించకపోయినా.. వరల్డ్ కప్ వరకు ఆయన జట్టులో కొనసాగుతారని ఇప్పటికే పలు సందర్భాలలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీమిండియా జట్టుకు ధోని అవసరం ఎంతో వుందని గుర్తించిన బిసిసిఐ.. విరాట్ కోహ్లీ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అతన్ని జట్టులో కొనసాగిస్తూ వస్తుంది. అయితే తాజాగా ధోనికి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం చేసి. టీ 20 జట్టు నుంచి కూడా తప్పించనున్నారా..? అందుకు అనుగూణంగా చర్యలు తీసుకుంటున్నారా..? అంటే అవునన్న సంకేతాలే కనబడుతున్నాయి. విండీస్, ఆస్ట్రేలియా జట్లతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్ల కోసం భారత జట్లను ప్రకటించిన సెలక్టర్లు అందులో ధోనీకి చోటివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించింది. విండీస్తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్తోపాటు ఆసీస్తో జరిగే నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్, టీ20 సిరీస్లకు జట్లను ప్రకటించింది. అలాగే, న్యూజిలాండ్-ఎ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు కోసం కూడా జట్టును ప్రటించారు. ఓపెనర్ మురళీ విజయ్, రోహిత్ శర్మ, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్లకు జట్టులో స్థానం కల్పించిన సెలక్టర్లు టీ20 సిరీస్లకు ధోనీని పక్కనపెట్టారు.
దీంతో ఇక ధోనీని ఒక్క వన్డేలకే పరిమితం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆసియాకప్కు దూరమైన కోహ్లీ విండీస్తో జరిగే టీ20 సిరీస్ కూ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ధోనీని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ రెండు టీ20 సిరీస్ లలోనూ ధోనీ ఆడబోవడం లేదన్నాడు. అంతమాత్రాన అతడి కెరీర్ ముగిసిందని భావించాల్సిన పనిలేదన్నాడు. రెండో వికెట్ కీపర్ ను పరీక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more