భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై వన్డేల్లో వేటు వేయబోతున్నారా..? అంటే అవుననే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్ కోసం త్వరలోనే జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ పై చివరి టెస్టులో శతకం బాది వెలుగులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధోనికి ప్రమాదంగా మారనున్నాడా.? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
గత వారం వెస్టిండీస్ తో ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్ వైపుకే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారని సమాచారం. రిషబ్ కు వన్డేల్లోనూ వికెట్ కీపర్ గా అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండంతో సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ధోనీ కూడా గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నాడు. గత నెల దుబాయ్ లో ముగిసిన ఆసియా కప్ తొలి మ్యాచ్లో హాంకాంగ్పై డకౌటైన ధోనీ.. టోర్నీలో భారత్ ని గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు.
‘ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రిషబ్ పంత్తో ధోనీ కెరీర్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఒకవేళ వెస్టిండీస్తో వన్డే సిరీస్లో రిషబ్ పంత్కి అవకాశమిచ్చినా.. ప్రపంచకప్లో మాత్రం ధోనీనే ఆడిస్తామని మరో అధికారి వెల్లడించారు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోటాలో గత ఐదు నెలలుగా దినేశ్ కార్తీక్ వన్డే జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ ను ధోని స్థానంలో రీప్లేస్ చేస్తారా.? లేదా.? అన్నది వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more