ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ షర్టు తీసి గాల్లో ఊపుతూ చేసిన సందడిని ఎవరు మాత్రం మరిచిపోగలరు.. టీమిండియా కెప్టెన్ గా ఆప్పుడు ఆయన చేసిన హంగామా పత్రికల పతాకశీర్షికలుగా మారింది. మరి ఇప్పుడు అదే లార్డ్స్ మైదానంలో గంగూలీ మరోసారి కనిపించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20, వన్డే, టెస్టు సిరీస్ల్లో గంగూలీ కామెంటేటర్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గంగూలీ ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నాడు. కామెంటేటరీ బాధ్యతల నుంచి కాస్త విరామం దొరికితే అక్కడ ఉన్న సందర్శన ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. తాజాగా గంగూలీ లార్డ్స్ మైదానానికి వెళ్లాడు. ఈ సందర్భంగా మైదానంలో సెల్ఫీ దిగి ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘బ్యాక్ ఎట్ లార్డ్స్.. నా కెరీర్ ఎక్కడైతే ప్రారంభించానో అక్కడే’ అని పేర్కొన్నాడు.
దీనికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నసీర్ హుస్సేన్ స్పందించాడు. ‘అదే బాల్కనీలో నువ్వు మరోసారి... కానీ, ఈ సారి నిన్ను షర్టుతో చూడటం చాలా సంతోషంగా ఉంది.’ అని హుస్సేన్ సరదాగా ట్వీట్ చేశాడు. 1996లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి గంగూలీ అరంగేట్రం చేసింది లార్డ్స్ మైదానంలోనే. ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సౌరభ్ 131 పరుగులు సాధించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more