భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెట్స్లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ధోనీ గత రెండు రోజుల నుంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఇదే అకాడమీలో నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ భువనేశ్వర్ కుమార్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్స్ సురేశ్ రైనా, కేదార్ జాదవ్తో కలిసి హాజరైన ధోనీ ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్నెస్ టెస్టు తర్వాత మిగిలిన క్రికెటర్లు వెళ్లిపోగా.. ధోనీ మాత్రం అకాడమీలోనే ఉంటూ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో మునుపటి హిట్టింగ్తో ఆకట్టుకున్న ధోనీ.. అదే జోరుని ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నాడు. జట్టులో పోటీ పెరగడం, బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుకు రావాలని ధోనీ యోచిస్తున్న నేపథ్యంలో అతను నెట్స్లో మునుపటి కంటే ఎక్కువగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియగా.. ఆ మ్యాచ్కి తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ నెట్స్లో ధోనీకి బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more