టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. తన హాయంలో ప్రపంచ కప్ ఓడినప్పటికీ కూల్ గా తనలోని భాధను బయటకు వ్యక్తపర్చకుండా వున్నాడు.. కానీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని ఈ ఏడాది తిరిగి ఐపీఎల్ లో ఆడుగుపెడుతున్న సందర్భంగా సీఎస్కే గురించి మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తరువాత వెంటనే తనను తాను సర్థికున్నాడు. చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు మరోమారు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తున్నాడు.
చెన్నై ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ధోనీ పాల్గొని మాట్లాడుతూ.. ‘నిషేధం కారణంగా గత రెండేళ్లు సొంత జట్టుకు దూరమై రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాను. ఇప్పుడు తిరిగి సొంత జట్టుకు ఆడుతున్నాను. ఈ క్షణం ఎంతో ఉద్వేగభరితమైనది. ఝార్ఖండ్, టీమిండియా, ఐపీఎల్ లో ఆడాను. ఝార్ఖండ్ తరఫున ఆడింది చాలా తక్కువ. భారత్ తరఫున ఇప్పటి వరకు 89 మ్యాచ్లు ఆడిన నేను చెన్నై తరఫున ఎనిమిదేళ్లలో 159 మ్యాచ్లు ఆడాను. తిరిగి ఈ ఏడాది పసుపు రంగు జెర్సీ ధరించడం ఎంతో ఆనందంగా ఉందని భావోద్వేగంతో మాట్లాడాడు.
నిత్యం కూల్ గా వుండే ధోని ఇంతలా బావోద్వేగానికి గురికావడం.. ఆ వీడియోలు నెట్ లో ప్రత్యక్ష్యం కావడంతో వాటిని అభిమానులు విపరీతంగా షేర్ చేసుకోవడంతో అవి కాస్తా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 7న ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ముంబయిలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
#Thala #Dhoni became very emotional while speaking about 2 years of struggle and come back of @ChennaiIPL !!! #WhistlePodu #WhistlePoduArmy pic.twitter.com/AWAycP7jrv
— CSK World (@CSK_World) March 29, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more