ప్రపంచ రికార్డును అందుకోవాల్సిన తరుణంలో.. చెత్త రికార్డులను మూటగట్టుకుంది. విదేశీ గడ్డపై అందులోనూ పేస్ పిచులపై అడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామని ధీమాను వ్యక్తం చేసి సఫారీ గడ్డపైకి వెళ్లిన టీమిండియా.. అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. తొలి టెస్టులో ఎదురైన తప్పులను మరోమారు అనభవపూర్వకంగా రెండో టెస్టులోనూ చేసి మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో చేజేతులా సిరీస్ ను సఫారీలకు అప్పగించింది.
రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 287 పరుగుల టార్గెట్ని చేరుకొని క్రమంలో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి భారత ఆటగాళ్లు ఒకొక్కరిగా కుప్పకూలిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 151 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా 135 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
తొలి ఇన్నింగ్స్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ భారీ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు టాప్ఆర్డర్ ఆటగాళ్లు తడబడిన కెప్టెన్ విరాట్(153) ఒక్కడే నిలిచి జట్టుకు 307 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ నేపథ్యంలో 28 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నిలకడైన ఆటతో రెండో ఇన్నింగ్స్లో 258 పరుగులు చేసి 287 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందుంచారు. అయితే భారత ఆటగాళ్లు మాత్రం ఆ టార్గెట్ను చేరుకోలేకపోయారు.
నాలుగో రోజు ఆటముగిసేసమయానికే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఐదో రెండో భోజన విరామ సమయానికి ముందే ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్లో రోహిత్ శర్మ(47) మినహా మిగితా ఆటగాళ్లు అందరూ.. స్వల్పస్కోర్కే పెవిలియన్ చేరారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో 50.2 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 151 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలింగ్లో ఎంగిడి 6, రబాడా 3 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లుంగి ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more