తొలి మ్యాచులో స్వల్ప లక్షచేధనలో చేష్టలుడికి చూసిన టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవ్వడంతో కోహ్లీసేనకు సెగ బాగానే తగిలింది. కేప్ టౌన్ లో ఐదు సెషన్ల ఆట ఉండగా అలవోకగా ఛేదించాల్సిన 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. టాప్ ఆర్డర్ మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనీసం 20 పరుగులు చేసేందుకు విలవిల్లాడారు. దీంతో అటు శిఖర్ ధావన్, ఇటు రోహిత్ శర్మలు టెస్టు ప్లేయర్లు కాదంటూ కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక విదేశాల్లో మెరుగైన రికార్డున్న పేసర్లను ఎదుర్కొనే అద్భుతమైన టెక్నిక్ ఉన్న రహానెతో పాటు కెఎల్ రాహుల్ లను తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఫామ్ బట్టి రోహిత్ ను జట్టులోకి తీసుకున్నామని విరాట్ చెప్పినా., జట్టు యాజమాన్యం మాత్రం కెఎల్ రాహల్, అజింక్య రహానేలను తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం, ఈ క్రమంలో టీమిండియా జట్టు తరపున వీరిద్దరూ చాలా సేపు సాధన చేశారు.
టీమిండియా ద్రావిడ్ వారసుడిగా ఖ్యాతిపోందిన అజింక్యను తీసుకోనందుకు కనీసం డ్రా అయ్యే అవకాశం చేజార్చుకున్నామని బీసీసీఐ, కోహ్లీ, రవిశాస్త్రి సహా జట్టు వ్యూహబృందంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వీరు సాధన చేస్తున్న చిత్రాలనే బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి సెంచూరియన్లో దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్లో రాహుల్, రహానెకు చోటు దక్కడం ఖాయమా? అన్న ఉత్కంఠ కలుగుతోంది. అజింక్య సఫారీ గడ్డపై 2013లో రెండు మ్యాచ్లు ఆడగా 69.66 సగటుతో 209 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. 96 అత్యధిక స్కోరు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more