విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో నిర్ణయాత్మక మూడో వన్డే తాను రెడీ అని మరీ మీరు రెడీనా అన్నట్లుగా సంకేతాలు పంపాడు శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్. ఈ మేరకు ఆ జట్టు మేనేజర్ అసంక గురుసిన్హ వెల్లడించారు. మొహాలిలో జరిగిన రెండో వన్డేలో శతకం బాదిన మాథ్యూస్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా విశ్రాంతి తీసుకున్న అతను కోలుకుని పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని చెప్పారు. విశాఖ మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశాడని తెలిపారు. మొత్తం 15 మంది ఆటగాళ్లు ఎంపికకు అందుబాటులో ఉన్నారని వెల్లడించారు.
ధర్మశాల వన్డేలో చతికిలబడిన టీమిండియా.. మొహాలిలో మాత్రం లంకను చిత్తు చేసింది. రోహిత్ శర్మ డబుల్ సెంచరీని నమోదు చేయగా, శిఖర్ ధావన్, కొత్త కుర్రాడు శ్రీయస్ అయ్యార్ బాగా రాణించడంతో ఏకంగా 392 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో శ్రీలంకపై 141 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇక మూడో వన్డే కోసం ఇప్పటికే విశాఖకు చేరుకుంది. ప్రస్తుతం రెండు జట్టు 1-1తో సమంగా వుండటంతో మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనున్న ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పధిలం చేసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more