టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి(893 పాయింట్లు) ఎగబాకాడు. శ్రీలంకతో మూడో టెస్టుకు ముందు ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ మూడో టెస్టు తరువాత ఏకంగా రెండోస్థానాన్ని అక్రమించాడు. డిల్లీలో జరిగిన టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో ద్విశతకంతో పాటు రెండో ఇన్నింగ్స్ః లో అర్ధశతకం సాధించడంతో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత ఆటగాడు పుజారా తాజా ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే లంక టెస్టు జట్టు సారథి దినేశ్ చండీమాల్ తన కెరీర్లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 743 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాళ్లు మురళీ విజయ (25), రోహిత్ శర్మ(40) తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాత్రమే 2005-06 డిసెంబరు-జనవరి మధ్య అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. తర్వాత ఆసీస్ కే చెందిన మాథ్యూ హెడెన్ ఈ ఘనతను అందుకున్నాడు. భవిష్యత్తులో స్మిత్-కోహ్లిలో ఎవరో ఒకరు ఈ ఘనతను అందుకునేలా కనిపిస్తున్నారు.
శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా బౌలర్ల జాబితాలో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడని భావించిన రవీంద్ర జడేజా ఒక స్థానంలో కోల్పోయి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ జడేజా స్థానంలో ఎలాంటి మార్పులేకుండా తన రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్ విషయానికి వస్తే శ్రీలంకపై 1-0తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ ఒక పాయింట్ కోల్పోయి 124 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more