న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు ఎంపికైన టీమిండియా వికెట్ కీపర్ దినేశ కార్తీక్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సేనలో ఒక్కడిగా పోరాటంలో దిగుతున్నందుకు ఆనందం వ్యక్తంచేశాడు. జట్టులో తిరిగి స్థానం లభించడంపై మాట్లాడుతూ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తరహాలో కీపింగ్ చేయాలంటే సాధన చాలా అవసరమని చెప్పాడు.
తాను కీపర్ గా చేయడం కన్న న్యూజీలాండ్ తో సిరీస్ నేపథ్యంలో ఎక్కడైనా ఫీల్డింగ్ చేస్తానని చెప్పాడు. అయితే ధోని స్థానంలో కీపింగ్ చేయాలంటే మాత్రం తనకు ఇంకొంత సాధన అవసరమని చెప్పాడు. అదే సమయంలో పనిలో పనిగా తన మనస్సులోని మాటను కూడా బయటపెట్టాడు కార్తీక్. తనకు నాలుగోస్థానంలో బ్యాటింగ్ బరిలోకి దిగాలని వుందని చెప్పకనే చెప్పేశాడు. దేశీయ క్రికెట్ లో తమిళానాడు తరపున అడుతున్న తాను ప్రస్తుతం నాలుగో స్థానంలోనే బరిలోకి దిగుతున్నానని, తెలుపు వర్ణం బంతితో తాను చక్కగా రాణిస్తున్నానన్నాడు
అదే స్తానంలో తాను న్యూజీలాండ్ తో కూడా బరిలోకి దిగితే తాను తప్పక రాణించగలనన్నా నమ్మకం తనకుందని అన్నాడు. కోహ్లీ సారథ్యంలో జట్టు మెరుగ్గా రాణిస్తోందని పేర్కొన్న దినేశ్ ఇటువంటి జట్టులో తనకు చోటు లభించడం ఆనందంగా ఉందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. కోహ్లీ ఎప్పుడూ విజయాన్నే కోరుకుంటాడని కితాబిచ్చాడు. ఇకపై తాను మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తానని దినేశ్ కార్తీక్ వివరించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more