అస్ట్రేలియా- టీమిండియా మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక చివరి టీ20 రద్దుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అప్రదిష్టను మూటగట్టుకుంది. తమ గ్రౌండ్ లో అడించే అవకాశాల కోసం ఆయా స్టేడియం యాజమాన్యాలు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక నిర్లక్ష్యంగా వ్యవహరించింది హెచ్ సీ ఏ. రోజంతా చినుకు లేకపోయినా.. ఎండ కాచినా.. మ్యాచ్ సమయానికి స్టేడియాన్ని సిద్దం చేయలేక నెట్ జనులు నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
కీలకమైన నిర్ణయాత్మకమైన మ్యాచ్ కు వేదికగా నిలుస్తుందని అనేక వ్యవప్రయాసలకోర్చి టిక్కెట్ సాధించిన అభిమానులతో పాటు మ్యాచ్ ను అసక్తిగా చూసేందుకు టీవీలకు అతక్కుపోయి నిరీక్షించిన అభిమానులందరూ హెచ్ సి ఏ ఘనఖ్యాతిని వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. అభిమాన క్రీడాకారులను చూసేందుకు తరలివచ్చిన వేలాది మందికి నిరాశేకు గురయ్యారు. స్టేడియంలోని పిచ్ పై కవర్లు కప్పిన సిబ్బంది.. ఔట్ ఫీల్డ్పై మాత్రం అశ్రద్దను కనబర్చారు.
దీంతో ఉప్పల్ ఔట్ ఫీల్డ్ బురదమయంగా మారింది. సిబ్బంది అప్పటకప్పుడు చెక్క పోడిని చల్లినా అది నిష్ప్రయోజనంగా మారింది. సిబ్బంది ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నా అన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ ను పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఉప్పల్ మైదాన నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు.
‘హెచ్సీఏ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైంది. నిర్వాహకులు మ్యాచ్ను నిర్వహించడంలో విఫలమయ్యారు. వారికి అసలు క్రికెట్పై ఆసక్తే లేదు, వర్షం లేకపోయినా మ్యాచ్ రద్దవడం హాస్యాస్పదం, హెచ్సీఏకు కావాలంటే ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని కప్పి ఉంచే కవర్లను అందజేస్తాం. బీసీసీఐ ప్రతినిధులు దయచేసి అలాంటి కవర్లను హైదరాబాద్ స్టేడియం నిర్వాహకులకు కొనిపెట్టండి’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు.
రాంచీలో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించగా.. గువాహటిలో జరిగిన మ్యాచ్లో వార్నర్ సేన గెలిచింది. దీంతో చివరి టీ20 మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. అలాంటి మ్యాచ్ను హైదరాబాద్ నిర్వహించలేకపోయింది. మైదానంలో చాలా ప్రాంతాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం, కొద్ది ప్రాంతాలు చిత్తడిగా ఉండటం, బంతి పైకి లేచే అవకాశమే లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యమివ్వడం హైదరాబాద్కి ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే హైదరాబాద్ ఫెయిలయ్యింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more