టీమిండియాతో ఇండోర్ వేదికగా జరిగిన అత్యంక కీలకమైన మూడో వన్డేలో భారీ స్కోరు చేసి టీమిండియా ముంగిట లక్ష్యంగా పెట్టాలనుకున్న తమ ప్రణాళికను ఆ ఇద్దరు అటగాళ్లు దెబ్బతీశారని అసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్ అన్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరంటారా..? టీమిండియా ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రాలే. తమ జట్టు భారీ స్కోరును చేయకుండా నియంత్రించడంలో వారిద్దరూ సఫలమయ్యారని అన్నాడు.
ప్రస్తుతం వున్న మేటి బౌటర్లలో వీరిద్దరూ ఉత్తమ డెత్ బౌలర్లలని ఆయన కితాబిచ్చాడు. వీరిద్దరూ తమ జట్టు అటగాళ్లకు ఏ దశలోనూ పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదన్నాడు. ప్రధానంగా స్లాగ్ ఓవర్లలో ఆ ఇద్దరి బౌలింగ్ లో పరుగులు రాబట్టడానికి ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు. ఇక పరుగులు రాబట్టేందుకు తమ బ్యాట్స్ మెన్లు తప్పుడు షాట్లకు వెళ్లాల్సివచ్చిందని దీంతోనే గేమ్ ప్లాన్ చేంజ్ అయ్యిందని స్మిట్ అన్నాడు.
ఇక్కడ చెడ్డ బంతుల్లో వికెట్లను సమర్పించుకోవడం బాధను మిగిల్చిందని అన్నాడు. నిన్నటి మ్యాచ్ గెలవడంలో టీమిండియా బౌలింగ్ మాత్రమే కారణమని, భారత్ బౌలింగ్ అద్భుతంగా ఉందని అన్నాడు. బూమ్రా, భువీ ఇద్దరి వల్లే మా ప్లాన్ పూర్తిగా దెబ్బతిందని అన్నాడు. మమ్మల్సి సులువుగా పరుగులు తీయకుండా నియంత్రించడంలో వీరిద్దరూ సఫలం చెందారు. దాంతో దూకుడుడా ఆడాల్సి వచ్చింది. వారిద్దరూ అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్టులని స్మిత్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more