బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్పై టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ధోని అడుతున్న తీరు చూస్తున్నావా లేదా.. ? ఎంఎస్కే అంటూ నెట్ జనులు దెప్పిపొడిచారు. ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ ను శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. దీంతో ఇక ఆయన టీమిండియాలో స్థానం సంపాదించడం కష్టమేనని అందరూ భావిస్తున్నారు.. దీనికి మీరేంమంటారు అని ఎంఎస్కేనేు మీడియా ప్రశ్నించింది.
దానికి స్పందించిన ఎంఎస్కే యువరాజ్ సింగ్ కు అవకాశాలు సన్నగిల్లినట్లేనన్న వాదనను తోసిపుచ్చాడు. అతనికి కేవలం విశ్రాంతి కల్పించామంతే నని అన్నారు. అతను టీమిండియా జట్టులోకి వచ్చేందుకు ద్వారలు ఇంకా తెరిచేవున్నాయని చెప్పుకోచ్చారు. శ్రీలంక సిరీస్ కు వన్డే జట్టు ఎంపిక చేసే సందర్భంగా యువీ, ధోనీ గురించి చర్చించామని వెల్లడించారు. అయితే ఆశించిన స్థాయిలో ధోని శ్రీలంకతో రాణించలేని పక్షంలో అయనకు ప్రత్యామ్నాయం తప్పదని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ధోనీ అభిమానులు ఎమ్మెస్కేపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంకతో రెండో వన్డేలో భువితో, మూడో వన్డేలో రోహిత్శర్మతో కలిసి మహీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. నాటౌట్గా నిలిచాడు. ఈ సందర్భంగా ‘ధోనీ ఆటను చూస్తున్నారా మీరు’, ‘కొందరు మాట్లాడతారు.. కొందరు చేతలతో సమాధానం చెప్తారు’ అంటూ ఎమ్మెస్కేపై ధోనీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more