టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో గురువారం పల్లెకలెలో జరగనున్న రెండో వన్డేలో కోహ్లీ ఈ రికార్డులను అధిగమించేందుకు ఆయన దృష్టి సారించాడు. అయితే రెండు రికార్డులను సాధించే క్రమంలో ఆయన చేయాల్సిందల్లా రెండు విభిన్న టాస్కులు కాదు. కేవలం తన బ్యాటు నుంచి పరుగులను జాలువారనిస్తే చాలు. ఆయన 62 పరుగులు సాధించడంతో ఈ రెండు రికార్డులను అందుకున్న వాడిగా నిలిచిపోతాడు.
ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా అగ్రస్థానంలో నిలవాలంటే.. సఫారీ జట్టుకు చెందిన క్రికెటర్ డుప్లిసిస్ ను అధిగమించాల్సిన అవసరం విరాట్ కోహ్లీ ఎదుట వుంది. ఈ క్యాలెండర్ ఇయర్లో 769 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్న విరాటుడు.. మరో 46 పరుగులు సాధిస్తే ఈ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ జాబితాలో నిలచిపోతాడు. ప్రస్తుతం ఈ జాబితాలో డు ప్లిసెస్ 814 పరుగులతో మొదటి స్థానంలో, ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 785 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ డు ప్లిసెస్కు 45 పరుగుల దూరంలోను, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రూట్కు 16 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదటి వన్డేలో కోహ్లీ 82 పరుగులు చేయటం వల్ల మూడో స్థానంలో ఉన్న మోర్గాన్ను అధిగమించాడు. ఇదే జోరును రెండో వన్డేలో కొనసాగిస్తే కోహ్లీ వారిద్దరి రికార్డులను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు. శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి వన్డేలో విజయం సాధించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్, కోహ్లీల భాగస్వామ్యం మొదటి వన్డేలో 197 పరుగులు సాధించింది.
2 మలింగాకు మరో రెండు వికెట్లు లభిస్తే 300 వికెట్ల క్లబ్ లో చేరుతాడు.
46 కోహ్లీకి 46 పరుగులు లభిస్తే.. ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసినవాడవుతాడు.
62 అదే కోహ్లీ 62 పరుగులు చేస్తే.. శ్రీలంకపై 42 వన్డేల్లో 57 పరుగుల సగటున రెండు వేల పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచిపోతాడు
29 మాథ్యూస్ 29 పరుగులు జోడిస్తే భారత్ పై 32 వన్డేల్లో వెయ్యి పరుగులు సాధించిన వాడిగా నిలుస్తాడు.
2 టీమిండియా మాజీ కెప్టెన్ ధోని మరో రెండు స్టంపులు సాధిస్తే 297 వన్డేల్లో శతక స్టంపులు సాధించిన కీపర్ గా నిలుస్తాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more