ఇంగ్లాండ్ వేదికగా జరుగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు అద్యంతం కనబర్చిన అద్బుత ప్రతిభకు ఇంకా వారిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తూనే వుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి చేరకున్న టీమిండియా మహిళీ క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. వీరోచిత ఇన్నింగ్స్ అడిన హర్మన్ ప్రీత్ కౌర్, జట్టు సారధి మిథాలీ రాజ్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి తదితరులు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకున్నారు.
ఇవాళ తెల్లవారుజామున ఇంగ్లాండ్ నుంచి ముంబై చేరుకున్న జట్టుకు బీసీసిఐ సిబ్బంది, అభిమానులు ఇండియా, జై భారత్ అంటూ నినాదాలు పలుకుతూ మహిళా క్రికెటర్లను ఘనంగా అహ్వానించారు. టోర్ని ఆసాంతం భారత మహిళల ప్రదర్శన భారత అభిమానుల మనసులను గెలుచుకొంది. ఈ సందర్భంగా టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఊహించని రీతిలో ఘన స్వాగతం లభించిందని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాము అంచనా వేయలేదన్నారు.
ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారని.. వారంతా వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో మహిళా క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదని అయితే ఐసీసీ ప్రపంచ కప్ లో తమ ప్రదర్శనతో ఇప్పుడు అందరూ తమ గురించి చర్చించుకోవడం సంతోషంగా వుందన్నారు. క్రీడల్లో మహిళలు రాణించాలని, మరీ ముఖ్యంగా బాలికలకు చిన్నస్థాయి నుంచి క్రీడలను అందిపుచ్చుకోవాలని అమె అన్నారు. ప్రపంచ కప్ లో రన్నర్ అప్ గా నిలిచిన టీమిండియా మహిళలకు త్వరలో బీసీసీఐ సత్కరించనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more