టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా ప్రపంచ కప్ జట్టుకు అమెను కెప్టెన్ గా ఐసీసీ ఎంపిక చేసింది. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో భారత జట్టును తన నాయకత్వంలో ఫైనల్ కు చేర్చింది. అదివారం జరిగిన ఫైనల్స్ లోనూ తుది వరకు విజయం కోసం పోరాడటంలోనూ అమె స్ఫూర్తిని పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఈ 34 ఏళ్ల మిథాలీకి జట్టును నడిపిన విధానాన్ని.. జట్టును ఆ స్థాయికి తీసుకెళ్లిన అమెకు ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది.
కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మిథాలీ బ్యాటింగ్ లోనూ అసాధారణంగా రాణించి 409 పరుగులు చేసింది. అత్యంత కీలకమైన న్యూజిలాండ్తో మ్యాచ్లో 109 పరుగులు చేసి జట్టుకు 186 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. తాజా వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో నలుగురు ఇంగ్లండ్ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.
ఐసీసీ ప్రకటించిన మహిళ ప్రపంచకప్ జట్టు
తమ్సిన్ బ్యూమొంట్ (ఇంగ్లండ్) - 410 పరుగులు
లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) - 324 పరుగులు
మిథాలీ రాజ్ (కెప్టెన్) (ఇండియా) - 409 పరుగులు
ఎల్లీ పెర్రి (ఆస్ట్రేలియా) - 404 పరుగులు, తొమ్మిది వికెట్లు
సారా టేలర్ (వికెట్ కీపర్) (ఇంగ్లండ్) - 396 పరుగులు, నాలుగు క్యాచ్లు, రెండు స్టంపింగ్లు
హర్మాన్ ప్రీత్ కౌర్ (ఇండియా) - 359 పరుగులు, ఐదు వికెట్లు
దీప్తీశర్మ (ఇండియా) - 216 పరుగులు మరియు 12 వికెట్లు
మారిజన్నె కప్ (దక్షిణాఫ్రికా) - 13 వికెట్లు
అలెక్స్ హార్ట్లీ (ఇంగ్లండ్) - 10 వికెట్లు
నాటాలిసైవర్ (12వ ప్లేయర్) (ఇంగ్లండ్) - 369 పరుగులు, ఏడు వికెట్లు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more