టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇప్పటికే వెనుకబడిన అతిధ్య వెస్టిండీస్ జట్టు ప్రయోగాలకు తెరలేపుతోంది. ఐదు వన్డేలలో భాగంగా ఇప్పటికే ఒక వన్డేను వర్షం అడ్డుకోగా, మరో వన్డేను టీమిండియా గెలిచింది. దీంతో ఇకపై జరగనున్న మూడు వన్డేల కోసం ప్రయోగాన్ని చేయదలిచింది. ఇందుకోసం ఇద్దరు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. దేశవాలీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న కైల్ హోప్, సునీల్ అంబ్రిస్ కు పిలుపును పంపింది. దీంతో ఈ ఇద్దరు యువ అటగాళ్లు ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేయనున్నారు.
శుక్రవారం మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో మొత్తంగా జట్టును షఫుల్ చేసింది. మిగతా మూడు వన్డేల కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 13మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ప్రస్తుత జట్టులోని జోనాథన్ కార్టర్, కెస్రిక్ విలియమ్స్పై వేటువేసింది. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. మరి ఈ యువ క్రికెటర్లైనా మూడో వన్డేలో రాణిస్తారా..? లేదా అన్నది వేచి చూడాల్సింది.
మారిన జట్టు:-
జాసన్ హొల్దర్ (కెప్టెన్), సునీల్ అంబ్రిస్, దేవేంద్ర బిషూ, రోస్టన్ చేజ్, మిగ్యుఎల్ కుమ్మినస్, కైల్ హోప్, షాయ్ హోప్, అల్జార్రి జోసెఫ్, ఎవిన్ లూయిస్, జాసన్ మొహమ్మద్, ఆష్లీ నర్స్, కీరన్ పావెల్, రోవ్మన్ పావెల్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more