ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రతీ మ్యాచ్ కూ తాము పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని అన్నాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును ధోనీ అద్భుతంగా ముందుకు నడిపించాడని, అతని నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని కోహ్లీ చెప్పాడు. గతంలో ఎన్నోసార్లు కోహ్లీ... ధోనీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అతని సలహాలు వెలకట్టలేనివని, మ్యాచ్ లో అనుభవజ్ఞుల సూచనలు అవసరమని కోహ్లీ పలుమార్లు తెలిపాడు.
నాలుగేళ్ల క్రితం బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బస్టన్ వేదికగా ‘భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు అదే మైదానంలో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ తో తలపడుతున్నామని అన్నాడు. ప్రస్తుత టోర్నీలో లీగ్లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్ లో ఇదే వేదికపై ఘన విజయం సాధించామని చెప్పాడు. ఇది తమకు కలిసొచ్చిన మైదానమని చెప్పుకోచ్చాడు విరాట్ కోహ్లీ.
లీగ్ దశలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లపై మంచి విజయాలు సాధించి సెమీస్ లో అడుగుపెట్టామని.. అయితే శ్రీలంకతో ఓటమి కొంత బాధ కలిగించింది. అయినప్పటికీ ఇప్పుడు పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్నామని చెప్పాడు. ఎడ్జ్ బస్టన్ లో అద్భుతంగా రాణిస్తున్నామని.. ఈ పిచ్ తమ గేమ్కి అనుకూలిస్తోందని తెలిపాడు. అభిమానుల మద్దతు మరిచిపోలేనిదన్నాడు. మెరుగైన ప్రదర్శన ద్వారా తప్పకుండా ఫైనల్ చేరతామని భావిస్తున్నామని కోహ్లీ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more