PCB elects Najam Sethi as the next chairman పీసీబి కొత్త చైర్మన్ గా నజామ్ సేథీ

Pakistan cricket board elects najam sethi as the next chairman

pakistan, pakistan cricket, pakistan cricket board, pcb, shaharyar khan, najam sethi, pakistan news, pakistan, cricket news, cricket

The PCB has announced Najam Sethi as its new chairman.at the Annual General Meeting (AGM) presided by current chairman Shaharyar Khan.

పీసీబి కొత్త చైర్మన్ గా నజామ్ సేథీ

Posted: 05/26/2017 09:47 PM IST
Pakistan cricket board elects najam sethi as the next chairman

పాకిస్తాన క్రికెట బోర్డు (పీసీబీ) నూతన చైర్మన్ గా నజమ్ సేథీ ఎంపికయ్యారు. ఇవాళ జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో నజమ్ సేథీని ఏకగ్రీవంగా నూతన చైర్మన్ గా ఎంపిక చేస్తు నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గా పని చేస్తున్న నజమ్ సేథీని ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇక తాను పీసీబీ చైర్మన్ గా కొనసాగనని షహర్యార్ ఖాన్ తనను బాధ్యతల నుంచి విముక్తిన్ని చేయాలని అభ్యర్థించిన నేపథ్యంలో ఆయన స్థానంలో సేధీని ఎంపిక చేశారు.

అగస్టు వరకు షహర్యార్ ఖాన్ పిసీబీ చైర్మన్ పదవిలో కొనసాగి అప్పుడు వీడ్కోలు పలకనున్నారు. ఆ తరువాత నజమ్ సేథీ పీసీబీ చైర్మన్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. అయితే సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న షహర్యార్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఈ పదవిలో కొనసాగినంత కాలం సహాయసహకారాలను అందించిన బోర్డు సభ్యులు, ఉద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక తన తరహాలోనే తన శిష్యుడు సేథీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను అభ్యున్నతిలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles