ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ సీజన్ ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గతానికి భిన్నంగా దేశవ్యాప్తంగా ఎన్నిమిది జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాలలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన బిసిసిఐ. అయితే అన్నింటా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మాత్రం అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్ స్టేడియంలో ఐపీఎల్ - 10వ సీజన్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అభిమానుల సందడి మధ్య సంబరాలు అంబరాన్ని తాకాయి.
కాగా మాజీ టీమిండియా కెప్టెన్ రవిశాస్త్రీ వ్యాఖ్యతగా వ్వవహరిస్తూ.. క్రికెట్ దిగ్గజాలను వేదికపైకి అహ్వానించడంతో ప్రారంభోత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లను స్టేడియంలోకి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో మైదానంలో తిరుగుతూ, అభిమానులను వారు ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ లను బీసీసీఐ సత్కరించి జ్ఞాపికలు అందజేసింది.
అనంతరం, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ఓపెన్ టాప్ వాహనంలో స్టేడియంలోకి అడుగుపెట్టింది. కాలాచష్మా, దమ్మాదమ్మా పాటలకు తన బృందంతో డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించింది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన లేజర్ షో ద్వారా ఈ లీగ్ గొప్పతనాన్ని ప్రదర్శించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more