టెస్టు క్రికెట్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లోనే అరంగ్రేటం చేసిన అస్ట్రేలియా క్రికెటర్ మాక్స్ వెల్.. ఇవాళ రాంచీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో తొలి శతకాన్ని కూడా నమోదు చేశాడు. రెండో టెస్టులో మిచెల్ మార్ష్ అర్ధాంతరంగా గాయపడటంతో మూడో టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకున్న మ్యాక్స్ వెల్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో శతకంతో రాణించి ఆసీస్ యాజమాన్యం పెట్టుకున్న ఆశల్ని నిజం చేశాడు.
గతంలో టెస్టు అరంగేట్రం చేసిన జట్టుపైనే మ్యాక్స్ వెల్ తాజాగా తొలి శతకం సాధించడం విశేషం. 2013లో భారత్ పై హైదరాబాద్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్ లో మ్యాక్స్ వెల్ అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి అదే జట్టుపై తొలి శతకం సాధించాడు. అటు మ్యాక్స్ వెల్ టెస్టు అరంగేట్రం..ఇటు ఆ ఫార్మాట్ లో తొలి శతకం భారత్ లోనే రావడం ఇక్కడ మరో విశేషం. ఇది మ్యాక్స్ వెల్ కెరీర్ లో నాల్గో టెస్టు మ్యాచ్. దీనికి ముందు టెస్టుల్లో మ్యాక్స్ వెల్ అత్యధిక స్కోరు 37.
మూడో టెస్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ తో కలిసి 191 పరుగుల భాగస్వామ్యాన్ని మ్యాక్ప్ వెల్ జత చేశాడు. ఈ క్రమంలోనే 185 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అనంతంర జడేజా బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more