బంగ్లాదేశ్ తో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. వరల్డ్ నెంబర్ వన్ జట్టుకు ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టు సరైన పోటీనివ్వలేకపోయింది. దీంతో వరుసగా ఆరు సిరీస్ లు గెలుచుకోవటమే కాదు, 15 విజయాలతో కెప్టెన్ గా కోహ్లీ, అజారుద్దీన్, ధోనీ రికార్డులను చెరిపివేశాడు.
తొలి ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (108), ఛటేశ్వర్ పూజారా (83), కోహ్లీ (204), అజింక్యా రహానే (82), సాహా (106) రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు షకిబల్ హసన్ (82), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (127), మెహదీ అల్ హసన్ (51) రాణించడంతో 388 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో పుజారా (54) రాణించడంతో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 459 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరి నాలుగు వికెట్లు తీసి కుప్పకూల్చారు. వారికి ఇషాంత్ శర్మ రెండు వికెట్లతో జతకలవడంతో బంగ్లాదేశ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 208 పరుగుల భారీ ఆధిక్యంతో భారత జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
చివరి బాల్ డ్రామా...
చివరి రోజు 7 వికెట్లు పడితే భారత్ విజయం ఖాయం. ఈ దశలో ఇషాంత్, జడేజా, అశ్విన్ ల దెబ్బకు బ్యాట్స్ మెన్ క్యూ కట్టారు. అయితే చివరి బ్యాట్స్ మెన్ మాత్రం కాసేపు పోరాడారు. సరిగ్గా టీ బ్రేక్ కు అశ్విన్ వేసిన లాస్ట్ బాల్ బ్యాట్స్ మెన్ టస్కిన్ అహ్మద్ ప్యాడ్ ను తాకి గాల్లో లేవగా ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బ్యాట్ కు తాకలేదంటూ దానిని అంఫైర్ నాటౌట్ గా ప్రకటించటంతో కోహ్లీ రివ్యూను కోరాడు. బంతి బ్యాట్ ను తాకపోయినప్పటికీ, స్టంప్ మీదుగా వెళ్లటంతో ఎల్బీడబ్ల్యూగా బ్యాట్స్ మెన్ వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో టీ బ్రేక్ కు ముందుగానే భారత్ విజయం నమోదైంది. ఇక అత్యధిక రివ్యూలు కోరి సక్సెస్ అయిన కెప్టెన్ గా కోహ్లీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు లేండి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more