చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఒలంపిక్స్ రజతపతక విజేత సింధూరం మళ్లీ మెరిసింది. అయితే మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ కు మాత్రం పరాజయం తప్పలేదు. ఈ టోర్నీలోని మహిళల సింగిల్స్ విభాగంలో భారత మిశ్రమ ఫలితాలను అందుకుంది. సైనా నెహ్వాల్ ఓడిపోగా, పీవీ సింధు శుభారంభం చేసింది.
తొలి మ్యాచ్ లో పోర్న్టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్లాండ్)తో తలపడిన సైనా 16-21, 21-19, 14-21తో పరాజయం పాలైంది. మొదటి గేమ్ లో వెనుబడిన సైనా రెండో గేమ్ లో పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో తడబడడంతో ఆమె పోరాటం ముగిసింది. దాదాపు గంటసేపు మ్యాచ్ జరిగింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకున్నాక సైనా ఆడిన తొలి టోర్నీ ఇదే.
మరో మ్యాచ్ లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చియా సిన్ లీపై పీవీ సింధు విజయం సాధించింది. వరుస గేముల్లో సిన్ లీని 21-12, 21-16తో ఓడించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. పురుషుల సింగిల్స్లో అజయ్ జయరాం, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. జు సియాఉన్ (చైనా)పై జయరాం 21-19, 20-22, 21-17తో విజయం సాధించాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడిన ప్రణయ్ 21-13, 21-13తో గెలిచి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more