నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా టాప్ అర్డర్, మిడిల్ అర్డర్, టెయిల్ ఎండర్స్ విఫలమైన.. కేవలం ముగ్గురంటే ముగ్గరే క్రికెటర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో స్కోరుబోర్డుపై గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. 5 వికెట్ల నష్టానికి 234 పరుగులతో రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన అశ్విన్, వృద్ధిమాన్ సాహాలు సెంచరీలతో రాణించడంతో రెండవ రోజు 129.4 ఓవర్లలో 353 పరుగులు మాత్రమే సాధించి ఆలౌటైంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు 47 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టులో టాప్ ఆర్డర్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకోగా, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రవిచంద్రన్ ఆశ్విన్ (297 బంతుల్లో 118), వృద్ధిమాన్ సాహా (227 బంతుల్లో 104) పరుగులు సాధించి రాణించడంతో 129.4 ఓవర్లలో 353 పరుగులు మాత్రమే సాధించి ఆలౌటైంది. చివరి ముగ్గురు బ్యాట్స్ మన్లు భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సామీ, ఇషాంత్ శర్మలు డక్కౌట్ అయ్యారు. విండీస్ బౌలర్లలో జోసఫ్, కుమిన్స్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.
ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు 59 పరుగుల వద్ద జాన్సన్ (75 బంతుల్లో 23 పరుగులు) వికెట్ ను కోల్పోయినప్పటికీ, ఆపై సంయమనంతో ఆడి 100 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం బ్రాత్ వైట్ 53 పరుగులు, బ్రావో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి టెస్టులో అత్యద్భుతంగా ఆడి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన భారత జట్టు, రెండో టెస్టులో వర్షం అడ్డు రావడంతో డ్రాతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో కీలకమైన మూడవ రోజు ఆటలో విండీస్ ఆటగాళ్లు నిలిస్తే, ఇది కూడా డ్రా దిశగా పయనమయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more