శ్రీలంక పర్యటనలో అధిత్యజట్టుతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. రెండో టెస్టు మ్యాచ్లో కూడా అదే బాట పట్టింది. దీంతో అసీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను లంకేయులు మరో టెస్టు మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకున్నారు. స్వదేశంలో తాము ఎంత బలవంతులమో శ్రీలంక క్రికెట్ జట్టు మరోసారి చాటిచెప్పింది. శ్రీలంక జట్టులో స్టార్లు లేకపోయినా, సమిష్టగా పోరాడి సిరీస్ను 2-0 తో కైవసం చేసుకుంది. రెండో టెస్టు మ్యాచ్లో శ్రీలంక నిర్దేశించిన 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోఆస్ట్రేలియా పేకపేడలా కుప్పకూలింది.
ఏ దశలోనూ లంకేయులకు పోటీనివ్వలేక మ్యాచ్ రెండు రోజులుండగానే చేతులెత్తేసింది. 25/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడు రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 183 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో 229 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్(41) రాణించగా,స్టీవ్ స్మిత్(30)ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో లంక స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా మొత్తం పది వికెట్లతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన పెరీరా.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు సాధించాడు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 281ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 237 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 106 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 183 ఆలౌట్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more