టీమిండియా ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే పెట్టిన పరీక్షలో అజింక్య రహానే మినహా టీమిండియా మొత్తం ప్లేయర్లు విఫలయమయ్యారు. ముఖ్యంగా టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పరీక్షలో రెండు పర్యాయాలు విఫలమయ్యారు. అంటే కుంబ్లే అంతటి కఠిన పరీక్ష పెట్టారా? అంటే... అదేమీ లేదు గాని ప్రాక్టీస్ సెషన్ లో టెస్టు మ్యాచ్ లో కట్టుకునే ప్యాడ్లతో బరిలోకి దిగమన్నాడు. అంతేకాదు, గంట పాటు ఔట్ కాకుండా బంతులను ఎదుర్కోవాలని సూచించాడు. అయితే ఈ గంట పాటు కూడా కోహ్లీ క్రీజులో నిలబడలేకపోయాడు.
ప్రాక్టీస్ సెషన్ లో కాకుండా ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లలోనే కోహ్లీ గంటల తరబడి ఏకధాటి ఇన్నింగ్ ఆడిన సందర్భాలున్నాయి. మరి కుంబ్లే పెట్టిన పోటీలో కోహ్లీ ఎందుకు నిలబడలేకపోయాడు? వివరాల్లోకెళితే... వెస్టిండిస్ టూర్ కు ముందు నిన్న ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టిన టీమిండియా సభ్యులతో తొలిరోజు యోగాసనాలు వేయించిన కుంబ్లే... రెండో రోజు ఉదయం వారందరినీ బెంగళూరుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఆలూరుకు తీసుకెళ్లాడు.
అక్కడ టెస్టు మ్యాచ్ లలో కట్టుకునే ప్యాడ్లిచ్చి రంగంలోకి దించాడు. గంట పాటు ఔట్ కాకుండా ఆడాలని ఓ పోటీ పెట్టాడు. అదే సమయంలో వీలయినన్ని ఎక్కువ వికెట్లు పడగొట్టాలని బౌలర్లను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ కు బోల్తా పడ్డ కోహ్లీ... అతడి బౌలింగ్ లోనే కేవలం గంట వ్యవధిలో రెండు సార్లు ఔటయ్యాడు. ఇక ఓపెనర్లుగా సత్తా చాటుతున్న శిఖర్ ధావన్, మురళీ విజయ్ లు కూడా కేవలం గంట పాటు క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్క అజింక్యా రెహానే మినహా ఏ ఒక్కరు కూడా కుంబ్లే ‘గంట’ పరీక్షలో నెట్టుకురాలేకపోయారట.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more