టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమిపై వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ లెండిల్ సిమ్మన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్ లో భారత్ ఓటమికి స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీనే కారణమని పేర్కొన్నాడు. అతని ప్రవర్తన కారణంగానే తాను అలాంటి గొప్ప ఇన్నింగ్స్ ఆడి సమాధానం చెప్పానని అభిప్రాయపడ్డాడు. ఆండ్రీ ఫ్లెచర్ స్థానంలో తనకు దక్కిన అవకాశం వినియోగించుకుని జట్టుకు విజయాన్ని అందించానని సిమ్మన్స్ పేర్కొన్నాడు.
వాంఖడేలో జరిగిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ 47 బంతుల్లో 89 పరుగులు చేసి భారీ స్కోరులో మరోసారి భాగస్వామి అయ్యాడు. అనంతరం చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో భారత్ పై విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ను ఓడించి టీ20 ప్రపంచకప్ ను రెండోసారి కైవసం చేసుకుంది.
తాను బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ తనపై నోరు పారేసుకున్నాడని సిమ్మన్స్ పేర్కొన్నాడు. తన బ్యాటుతోనే అతడికి సమాధానం చెప్పి, విరాట్ ఒక్కడు మాత్రమే బెస్ట్ బ్యాట్స్ మన్ కాదని నిరూపించాలని భావించినట్లు వెల్లడించాడు. విరాట్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఆవేశంగా, దురుసుగా ప్రవర్తిసాడని, బ్యాటింగ్ మాత్రం గుడ్ అని చెప్పుకొచ్చాడు. భారత్ కు అభిమానుల మద్ధతు చూసి తాను షాక్ తిన్నానని, తన కెరీర్ లో ఈ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలుస్తుందన్నాడు. నిజానికి ఆ మ్యాచ్ లో సిమ్మన్స్ రెండుసార్లు క్యాచ్ ఔట్ కాగా, ఆ బంతులు నోబాల్స్ కావడంతో ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more