ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ అటగాడిగా ఖ్యాతి గడించిన భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇప్పుడు అపర కుబేరుడే. అయితే ఆయన కూడా ఓ సమయంలో క్యాబ్కు డబ్బులు చెల్లించలేని పరిస్థితిని ఫేస్ చేయవలసి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గుర్తు చేసుకున్నాడు. ఓ సమయంలో తనకు తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు క్యాబ్కు ఇచ్చేందుకు డబ్బులు లేని పరిస్థితి ఉండేదన్నాడు. తాను అండర్ 15 క్రికెట్ గేమ్ ఆడేందుకు పుణే వెళ్లానని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు స్టేషన్ నుంచి క్యాబ్లో వచ్చేందుకు డబ్బులు కూడా లేవని చెప్పాడు.
'నాకు 12 ఏళ్ల వయస్సున్నప్పుడు ముంబై అండర్ 15 జట్టుకు సెలక్ట్ అయ్యాను. నేను సెలక్ట్ కావడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొంత డబ్బు తీసుకొని పుణే వెళ్లాను. అక్కడ మూడు మ్యాచులు ఆడేందుకు వెళ్లాను.' అని సచిన్ చెప్పాడు. 'నేను మ్యాచ్ ఆడాను. నేను 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ అయ్యాను. నేను అసంతృప్తికి గురయ్యాను. అసంతృప్తితో డ్రెస్సింగ్ రూంకు వచ్చాను. ఏడ్చాను. ఆ తర్వాత తనకు మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే అక్కడ భారీ వర్షం కురుస్తోంది.' అని చెప్పాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'రోజంతా వర్షం కురుస్తుండటంతో ఏం చేయలేకపోయాం. దీంతో బయటకు వెళ్లాం. సినిమా చూశా. బయటకు వెళ్లి తిన్నాను. డబ్బు ఎలా పద్ధతిగా లేదా పొదుపుగా ఖర్చు చేయాలో అప్పుడు నాకు తెలియదు. డబ్బంతా ఖర్చు చేశాను. ఆ తర్వాత రైలులో ముంబైకి వచ్చాను. నా వద్ద అప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నేను రెండు పెద్ద సంచులు తీసుకు వచ్చాను. స్టేషన్లో దిగిన తర్వాత నేను శివాజీ పార్కు వైపు నడక సాగించాను. ఎందుకంటే అప్పుడు నా వద్ద ఒక్క రూపాయి లేదు.' అని టెండుల్కర్ నాటి సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు.
అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు అంతగా రాలేదన్నాడు. అయితే తాను డబ్బులను పోదుపుగా వాడి వుండినట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నాడు. తాను అలా కాకుండా డబ్బున్నంతా ఖర్చుచేయడం వల్లే తనకీ పరిస్థితి వచ్చిందన్నాడు. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా సచిన్ చెప్పాడు. అదే కనక సెల్ ఫోన్ ప్రపంచం అప్పటికే విస్తరించి వుంటే.. తన వద్ద కూడా ఒక మొబైల్ ఫోన్ ఉండి ఉంటే.. తాను ఓ ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెడితే తన తండ్రి లేదా తల్లి తనకు డబ్బులు అరేంజ్ చేసేవారని, అప్పుడు తాను క్యాబ్ మాట్లాడుకొని వెళ్లేవాడిని' అని సచిన్ చెప్పాడు. ఇలా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more