అద్భుతాలు చోటుచేసుకుని ఏ జట్టు ఎప్పుడు ఎలా గెలుస్తుందో కూడా అంచనా వేయలేని ఫార్మెట్ టీ 20. ఇక తాజాగా జరుగుతున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్లో మెగా ఈవెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేది ధాయాధులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్. టీ 20లలో భారత్ పై ఇప్పటి వరకు టీ 20 ఫార్మెట్ లో గెలుపనేది ఎరుగని పాకిస్థాన్ జట్టు, తాజాగా జరుగుతున్న టోర్నమెంటులో బంగ్లాదేశ్ పై గెలిచి ఉత్సాహంతో వుంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చరిత్రను తిరగరాస్తామని, రాయాలని ఉవ్విళ్లూరుతుంది. తమకు ఈడెన్ గార్డెన్స్ అచ్చోచ్చిన మైదానమని, ఇక్కడ చరిత్రను తిరగరాస్తామని పాకిస్తాన్ అంటోంది.
వరుస విజయాలకు తోడు అసియా కప్ టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా.. టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్వల్ప స్కోరు చేధనలో ఓటమి చవిచూసింది. దీంతో అప్పటి వరకు హాట్ ఫేవరేట్ గా వున్న జట్టు కాస్తా.. తీవ్ర ఒత్తడికి గురవుతుంది. టీ 20 టైటిల్ సాధించి స్వదేశంలో జరిగిన టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్రను లిఖించాలని భావించిన ధోనిసేన.. ఇకపై లీగ్ దశలో అన్ని మ్యాచ్ లను గెలవాల్సిన పరిస్థితి రావడంతో ఒత్తిడిక గురవుతుంది.
ఒక మ్యాచ్ లో స్వల్ప స్కోరును సాధించలేని జట్లు కూడా మరో మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించడంలో విజయం సాధిస్తుంటాయని... అదే ఫోట్టి ఫార్మెట్ గ్రేట్ నెస్. టీ 20 మ్యాచ్ లలో ఎవరూ ఫేవరెట్లు కాదని.. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులే వారిని మ్యాచ్ విన్నర్లుగా మారుస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నవాదనలు ఏకీభవించిన దాయాధి క్రికెటర్లు గెలుపు కోసం మాత్రం శ్రమించాల్సి వుంటుంది. ఈడెన్ లోని మెగా ఈవెంట్ లో ఎవరు గెలుస్తారు.. విజయం ఎవరిని వరిస్తుందన్నది మాత్రం సాయంత్రం వరకు వేచి చేడాల్సిందే. అయితే దాయాధులిద్దరూ వైరి వర్గంలా కాకుండా.. స్పోర్టివ్ స్పిరిట్ తో మాత్రమే ఈ మ్యాచ్ అఢాలని భావిస్తున్నారు.
స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో తాము విజయం సాధిస్తామని చెప్పుకుంటూ వచ్చిన టీమిండియాను.. చరిత్రను తిరగరాస్తామని చెబుతూ బరిలో దిగుతున్న పాకిస్తాన్ ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు కోసం దేశ, విధేశాల నుంచి ఇప్పటికే పలువురు అభిమానులు కోల్ కతాకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఈడెన్ లో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవ్వనున్నారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా పోలీసులు, సాయుధ దళాలు ఈ మ్యాచ్ కు గట్టి పహారాను, భందోభస్తును ఏర్పాటు చేస్తున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more