బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంటులో అతిధ్య జట్టు చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలవ్వడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ జావెద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు. జట్టు ఆటగాళ్లతో పాటు కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ సహా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా ఆయన విమర్శలు గుప్పించాడు. ముందుగా అఫ్రీదిని టార్గెట్ చేసుకున్న ఆయన అసలు ఆఫ్రిది అవసరం ఇంకా జట్టుకు ఏముందంటూ తనదైన శైలిలో చురకలంటించాడు.
ఆఫ్రిది ఒక ముగిసిన అధ్యాయంగా అభివర్ణించిన ఆయన. కొన్నేళ్ల క్రితం వరకూ ఆఫ్రిది నమ్మదగిన ఆటగాడేనన్న ఆయన.. ప్రస్తుతం ఆ స్థాయి ఆట ఆయన ఇప్పుడు అడటం లేదని చురకలంటించాడు. ఒక జట్టులో కెప్టెన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నప్పుడు విజయాలు ఎలా వస్తాయని ప్రశ్నించాడు. జట్టులో ఆఫ్రిది స్థానం ఎక్కడో అతని నిర్ణయించుకోవాలని మియాందాద్ ఎద్దేవా చేశాడు. దీంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలిని కూడా తప్పుబట్టాడు. జాతీయ జట్టుకు క్రికెటర్లను ఎంపిక చేసే విధానం సరిగా లేదంటూ మండిపడ్డాడు.
దేశవాళీ స్థాయిలో ఆటను మెరుగుదిద్దడంలో పీసీబీ పూర్తిగా విఫలమైందన్నాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ ద్వారా నాణ్యమైన ఆటగాళ్లు బయటకు వస్తారని భావించినా అది జరగలేదన్నాడు. జాతీయ ఆటగాడు పీసీబీలో ఆడకంటే బిగ్బాష్ లీగ్, ఐపీఎల్ వంటి విదేశీ లీగ్ల్లో ఆడటానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ లో ఏమి జరుగుతుందనేది బోర్డు పెద్దలకు మాత్రమే తెలుసన్నాడు. ఇటీవల ఆసియాకప్ లో భారత్ పై పాకిస్తాన్ ఓడిపోవడం తీవ్ర నిరూత్సాహానికి గురిచేసిందన్నాడు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more