శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు అదే దూకుడుతో దూసుకుపోతూ ట్వంటీ-20లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. టి20 క్రికెట్ సిరీస్ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్ లో లంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది.
ఒక దశలో 46 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాలలో మునిగిన లంక జట్టును ఇశాని లకుసురియాగ్ తో పాటు అమ్మ కంచనాలు కలసి 8 విక్కెట్ కు మంచి బాగస్వామ్యం నెలకొల్పడంతో లంక కనీసం 89 స్కోరును బోర్డుపై పెట్టగలిగింది. కౌశల్య(25), జయాంగిని(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లంకను అత్యల్ప స్కోరుకే అలౌట్ చేయడంలో భారత స్పిన్నర్లు తమ సత్తా చాటారు. ఏక్తా బిష్త్ 3, అనుజ పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు.
90 పరుగుల టార్గెట్ ను 37 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి భారత్ చేరుకుంది. 13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు ఓపెనర్లు వెల్లస్వామి వనిత తో కలసి స్మృతి మందన చక్కటి భాగస్వామితో కలసి 8.3 ఓవర్లలో 64 పరుగులు సాధించారు. అయితే వెల్లస్వామి వనిత 25 బంతులలో 34 పరుగులు సాధించి వెనుదిరిగింది. దీంతో వన్ డౌన్ లో వచ్చిన వేదా కృష్ణమూర్తి జత కలసి మరో వికెట్ నష్టపోకుండా నిర్ణీత లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. మంధన 43, వనిత 34, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు. అంతకుముందు రెండు టీ20లను గెలిచిన మిథాలి సేన.. ఈ విజయంతో క్లీన్ స్వీప్ చేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more