క్రికెట్ నుంచి తప్పుకోవటంపై సరైన సమయంలో ఆలోచిస్తానని టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేర్కొన్నాడు. ' వాస్తవికంగా జీవించే వ్యక్తుల్లో నేను ఒకడిని. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్, టీ20 వరల్డ్కప్లో జట్టును నడిపించటంపైనే నా దృష్టి. రిటైర్మెంట్పై సరైన సమయంలో ఆలోచిస్తాను' అని ధోని అన్నాడు. 2015 వరల్డ్కప్ సెమీస్ ఓటమి తర్వాతా ఇదే ప్రశ్న ఎదుర్కొన్న మహి.. రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పటం గమనార్హం. టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లి మెరుగైన విజయాలు సాధిస్తున్న సమయంలో.. అన్ని ఫార్మాట్లలో సారథ్య పగ్గాలు కోహ్లికే అప్పగించాలనే డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు గత ఏడాది కాలంగా ధోని బ్యాట్స్మన్ నామమాత్రమైన ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. టీ20 వరల్డ్కప్ తర్వాత కెప్టెన్గా ధోని భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కొన్నాండ్లుగా వార్తలొస్తున్న నేపథ్యంలో మహి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంగారూలతో టీ20, వన్డే సిరీస్ నిమిత్తం జట్టు ఆస్ట్రేలియా బయల్దేరే ముందు ధోని మీడియాతో మాట్లాడాడు.
మనీశ్, గుర్కీరత్లకు అవకాశం : వన్డేల్లో సురేశ్ రైనా లేకపోవటంతో అతని స్థానంలో ఎవరిని ఆడనించాలనే విషయంపై కెప్టెన్ ధోని స్పష్టతనిచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 5,6,7 స్థానాల్లో ఆడటం ఎల్లప్పుడూ క్లిష్టమే. టాప్ ఆర్డర్లో శిఖర్, రోహిత్, కోహ్లి, రహానే రూపంలో అద్భుత బ్యాట్స్మెన్ ఉన్నారు. కానీ ఎంతటి బ్యాట్స్మన్కు ఐనా లోయర్ ఆర్డర్లో ఆడటం కష్టసాధ్యమే. మనీశ్ పాండే, గుర్కీరత్ మన్ సింగ్లలో ఒకరికి రైనా స్థానం దక్కనుంది. ఎవరికి అవకాశం దక్కినా ఐదో స్థానంలో ఆడించేందుకే మొగ్గుచూపుతాం అని ధోని అన్నాడు. 2015 వరల్డ్కప్ భారత్కు మంచి టోర్నీ. టోర్నీలో సెమీస్ మినహా అద్భుతంగా ఆడాం. బలమైన ప్రత్యర్థి స్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలే. కొత్త ఆటగాళ్లకు ఇదో అవకాశం. దేశవాళీ ప్రదర్శనను అంతర్జాతీయ వేదికపై ఎలా చూపగల్గుతారనే దానిపై భవిష్యత్ ఆధారపడి వుంటుంది' అని మహి పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more