ఫోట్టి ఫార్మెట్ క్రికెట్ లీగ్ లు కాసులను రాల్చే లీగ్ లుగా మారడంతో.. క్రికెట్ ను ప్రధానంగా ఆటగా అధరిస్తున్న అన్ని దేశాలు ఈ ఫార్మెట్లను తెరమీదకు తీసుకువస్తున్నాయి. భారత్ తరువాత అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ దిశగా అడుగులు వేస్తుండగానే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏకంగా షెడ్యూలును విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 25 వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. ఇందుకు వేధికలను కూడా ఖరారు చేసింది. కాగా ఈ లీగ్ లో అడేందుకు ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లకు అనుమతినిచ్చింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) లో అడటంపై కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెరదించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆదివారం పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లను ఆపాలని తాము కోరుకోవడంలేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దాదాపు 25 మంది పాక్ ఆటగాళ్లు బీపీఎల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదు సంవత్సరాలు నిషేధానికి గురైన మహ్మద్ అమిర్ కూడా పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more