రంజీ ట్రోఫీ గ్రూప్ బి లో ఆంధ్ర-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఇరు జట్ల మద్య సాగిన మ్యాచ్ లో అధ్యంతం బౌలర్లు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఆరంభమైన మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు విశేషంగా రాణించి మొత్తంగా 33 వికెట్లు నేలకూల్చారు. తొలి రోజు 17 వికెట్లు నేలకూల్చిన బౌలర్లు.. రెండో రోజు 16 వికెట్లను తీశారు. దీంతో నాలుగు రోజుల జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది. ఆద్యంతం బౌలర్ల హవానే నడిచిన ఈ మ్యాచ్ లో ఆంధ్రపై పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆంధ్ర 45 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలగా, పంజాబ్ 147 పరుగులకు ఆలౌటయ్యింది.
128/7 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన పంజాబ్ మరో 19 పరుగులు వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర 133 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్ స్పిన్నర్ గుర్ కీరత్ సింగ్ ఐదు వికెట్లు తీసి ఆంధ్రను చావుదెబ్బ తీశాడు. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్ లో కేఎస్ భరత్(39), ప్రశాంత్(29), ప్రదీప్ (26), శశికాంత్(15)లు మాత్రమే రెండంకెల మార్కును చేరిన వారిలో ఉన్నారు. ఆంధ్ర ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో 67 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పంజాబ్ కు నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ సాధించింది. పంజాబ్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 52 పరుగులకు తొమ్మిది వికెట్లను పడగొట్టిన గుర్ కీరత్ సింగ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
స్కోరు వివరాలు :
* ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 80 ఆలౌట్
* రెండో ఇన్నింగ్స్ 133 ఆలౌట్
* పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 147 ఆలౌట్
* రెండో ఇన్నింగ్స్ 67/3
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more