దక్షిణాఫ్రికాతో ముంబై వేదికగా వాంఖేడ్ స్టేడియంలో రేపు జరగనున్న తుది మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతుంది. ఇరు జట్ట మద్య పంతం నీదా నాదా హై.. వన్డే టైటిల్ సోంతం నీదా నాదా అంటూ సాగనుంది. దీంతో అభిమానుల మధ్య కూడా తుది వన్డే వెయ్యి వోల్జేజీల ధ్రిలర్ గా కొనసాగనుంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇరు జట్టు చెరో రెండు మ్యాచ్ లను ెలుపోంది సమవుజ్జీలుగా వున్నాయి. దీంతో తుది మ్యాచ్ పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్పై పైచేయి సాధించేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతుంది.
మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా గత వన్డేలో ఫలితాన్నే పునరావృతం చేసి సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుని మరోసారి టీమిండియాకు షాకివ్వాలని చూస్తోంది. ఇప్పటికే తీవ్ర ప్రాక్టీస్ లో నిమగ్నమైన రెండు జట్లు వ్యూహ-ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండో, నాల్గో వన్డేలో బ్యాట్స్ మెన్ వైఫల్యంతో డీలా పడిన సఫారీలు..ఆ తప్పును చివరి వన్డేలో మళ్లీ చేయకుండా సమష్టిగా పోరాడాలని యోచిస్తోంది.
అటు విరాట్ కోహ్లి, సురైష్ రైనా ఫామ్ లోకి రావడంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతుండగా, ఇటు దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ ఏబీ డివిలియర్స్ , డీ కాక్ ల మినహా మిగతా వారు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టులో కీలక ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా, డేవిడ్ మిల్లర్, డు ప్లెసిస్ లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో కాస్త డైలామాలో ఉన్న డివిలియర్స్ సేన దాన్ని అధిగమించాలని కసరత్తులు చేస్తోంది. సిరీస్ ను ధోని సేన సాధిస్తుందా? లేక సిరీస్ ను సమర్పిస్తుందా?అనేది వేచిచూడక తప్పదు.. ఇక ధోనీ కెప్టెన్సీపై కత్తివేలాడుతోంది. ఈ సిరీస్ ఓడిపోతే ధోనీపై ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖేడ్ స్టేడింయంలో జరిగే వన్డే గెలవాలంటే ధోనీసేన సమష్టిగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు సఫారీలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమరోత్సాహంతో ఉన్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more