అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. సౌత్ అఫ్రికాతో జరుగనున్న మూడో వన్డేలో కొత్త మిడిల్ ఆర్డర్ తెరపైకి రానుంది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ ధోని సూచనప్రాయంగా తెలిపాడు. ఇకపై జరగనున్న అన్ని వన్డే మ్యాచులలో ఈ మార్పులు వుంటాయన్నాడు. టీమిండియా వన్డే జట్టు మిడిల్ ఆర్డర్ లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపాడు. నెంబర్ మూడు స్థానంలో గత కొంత కాలంగా బ్యాటింగ్ కు దిగుతున్న విరాట్ కోహ్లీని ఆ స్థానం నుంచి మార్చి.. అజింక్య రహానే ను ఆ స్థానంలో పంపుతున్నట్లు చెప్పాడు. పేస్ బౌలర్లను ఎదుర్కోన్న తరువాత స్పిన్ బౌలర్లను రహానే ధీటుగా ఎదుర్కోని, ధాటిగా పరుగులు సాధించడమే కారణంగా చెప్పుకోచ్చాడు.
కాగా ప్రస్తుత టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ నెంబర్ త్రి స్థానం నుంచి మార్చవద్దని కూడా పలువురు సూచిస్తున్నారు. ఈ స్థానంలో కొనసాగుతూ కోహ్లీ అనేక పరుగులను రికార్డులను సాధించాడని, ఆయను నెంబర్ త్రి స్థానం నుంచి మార్చితే ఆయన ఆటపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వాదిస్తున్నారు. అయితే మరికోందరు మాత్రం ప్రస్తుతం అజింక్య రహానే నెంబర్ త్రి స్థానానికి సూట్ అవుతాడని పేర్కోంటన్న తరుణంలో ధోని తన నిర్ణయాన్ని సూచన ప్రాయంగా తెలిపాడు. ధోని అనుకున్నవన్నీ అనుకునట్లుగా జరిగితే రానున్న వన్డే మ్యాచ్ నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more