బిసిసిఐ పాలిట కాసుల వర్షం కురిపిస్తున్న వందల మిలియన్ల టోర్నమెంటుగా ప్రఖ్యాతి చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుంచి ఆ రెండు జట్లను నిషేధించడం సబబు కాదని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ని సిరీస్ లలో ఆడిన ఈ జట్లను నిషేధించడం సమంజసం కాదని, సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును ఆయన సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ లోథా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపైన నిషేధం వేటు వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తద్వారా ఆయన చెన్నై, రాజస్థాన్ జట్లను బెయిలవుట్ చేసేందుకు పూనుకున్నారు. విచారణ ప్రక్రియను ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ప్రభావితం చేశారని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కారణంగానే చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీల పైన చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోథా కమిటీ తీర్పును నిలుపుదల చేయాలని ఆయన హైకోర్టును కోరారు. అలాగే, లోథా కమిటీ తీర్పును కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం.. చెన్నై ఫ్రాంచైజీ వేసిన పిటిషన్తో కలిసి రేపు విచారణ చేపట్టనుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more