కొలంబో వేదికగా అతిధ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న మూడవది, చివరి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆధ్యంతం బౌలర్లు తమ స్తతాను చాటారు. కొలంబోలోని సిన్ హాలేసి స్కోర్స్ట్ క్లబ్ గ్రౌండ్ బౌలింగ్ కు అత్యద్భుతంగా కలసివచ్చింది. దీంతో అటు సీమర్లు, ఇటు స్పిన్నర్లు తమ మెరుగైన ప్రధర్శనను చాటారు. మూడవ రోజు ఒక్క రోజునే 15 విక్కెట్లను పడగొట్టారు. 8 విక్కెట్ల నష్టానికి 292 పరుగుల ఒవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లాసేన మూడు విక్కెట్లను లంక బౌలర్లు తీయగా, లంకేయుల 10 విక్కట్లను పడగొట్టి టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. దీనికి జీర్ణంచుకోలేని లంక బౌలర్లు భారత్ కు చెందిన మూడు వికెట్లను పడగొట్టారు. వెరసి ఏకంగా ఒకే రోజు ఇరు జట్లకు కలపి 16 విక్కెట్లు పడిపోయాయి.
ఇదిలావుండగా, చివరి టెస్టు మూడవ రోజున రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లో లంకేయులపై కీలక అదిక్యం సాధించిన టీమిండియాకు అదిలోనే మూడు విక్కెట్లను కోల్పయింది. కేవలం రెండు పరుగులకే కోహ్లీ సేన రెండు వికెట్లను కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరుకు చేరేందుకు దోహదపడిన సెంచరీ హీరో.. చత్తీశ్వర్ పూజరా రెండు బంతులను ఎదుర్కోని పరుగలేమి చేయకుండా డకౌట్ గా వెనుదిరిగాడు. కాగా లోకేష్ రాహుల్ ఎనమిది బంతులను ఎదుర్కోని రెండు పరుగులకే ఔలయ్యాడు. ఆ తరువాత వచ్చిన అజింక్య రహానే కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. శ్రీలంక పేసర్లు నువ్వన్ ఫ్రదీప్ రెండు వికెట్ల, ప్రసాద్ లు ఒక వికెట్ పడగోట్టారు. వర్షం రావడంతో ఆట ముగిసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 పరుగుతో, రోహిత్ శర్మ 14 పరుగులతో కోనసాగుతున్నారు.
రెండు రోజు సాధించిన 292 పరుగల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడవ రోజున మరో 20 పరుగలను జతకలిపి అలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 201 పరుగులకే అటౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 111 పరుగుల అధిక్యాన్ని పోందింది. లంకేయులు తొలి ఇన్నింగ్స్ లో పరుగులను సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదిన లంకేయులు టీ విరామానికి 7 విక్కెట్లు కొల్పోంది. చివరకు రోజు గడవక ముందే కోహ్లీసేను రెండో ఇన్నింగ్స్ చేయాలని బ్యాట్ ను అప్పగించారు. కేవలం 52.2 ఓవర్లలో ఆటను ముగించేశారు.
ఆరంభం నుంచే టీమిండియా పేసర్లు లంక బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయుల భరతం పట్టారు. పదునైన బౌలింగ్ తో లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు పడగొట్టారు. తరంగ(4), సిల్వా(3), కరుణరత్నె(11), చందిమాల్(23), మాథ్యూస్(1) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5, స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 312 పరుగులకు ఆలౌటైంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more